హైదరాబాద్లోని సీఎంఆర్ కాలేజీలో సంచలనం సృష్టించిన ఘటనపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. బీహార్కు చెందిన నందా కిశోర్, గోవింద్ కుమార్ను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరు అమ్మాయిల హాస్టల్ బాత్రూమ్ల వద్ద అసభ్యంగా తొంగిచూసినట్లు గుర్తించారు. ఈ కేసులో నందా కిశోర్, గోవింద్తో పాటు మరో ఐదుగురిపై కేసు నమోదు చేశారు. కాలేజీ చైర్మన్ చామకూరు గోపాల్రెడ్డి, డైరెక్టర్ జంగారెడ్డి, ప్రిన్సిపాల్ అనంతనారాయణ, హాస్టల్ వార్డెన్ ప్రీతిరెడ్డి, క్యాంపస్ వార్డెన్ ధనలక్ష్మిపై కూడా కేసు నమోదు అయింది. విద్యార్థినుల ఫిర్యాదులను పట్టించుకోకుండా వదిలిపెట్టిన యాజమాన్యం పై విద్యార్థులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
