ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ) నిఖేష్ కుమార్ను ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ అధికారులు చంచల్గూడ జైలు నుంచి కస్టడీకి తీసుకున్నారు. నిఖేష్ కుమార్పై రూ. 500 కోట్లకు పైగా అక్రమ ఆస్తులు కూడబెట్టారని ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో విచారణ కోసం కోర్టు ఆయనను నాలుగు రోజుల పాటు ఏసీబీ కస్టడీకి అనుమతించింది.
