కాకతీయుల కళా వైభవానికి ప్రతీకగా నిలిచిన యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం భారీ నిధులను కేటాయించింది. ఆదివారం (డిసెంబర్ 8) కేంద్రం జీవో జారీ చేస్తూ ఈ అభివృద్ధి పనులకు రూ.73 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఈ నిధులను సాస్కి స్కీమ్ కింద తెలంగాణ పర్యాటక రంగం అభివృద్ధి కోసం వినియోగించనున్నారు. రామప్ప ఆలయం పరిసర ప్రాంతాలు, రామప్ప చెరువు, కోటగుళ్లు ఆలయం, గణపసముద్రం సరస్సు వంటి ప్రదేశాలను ఆధునిక టూరిజం కేంద్రాలుగా మార్చనున్నారు.
