ప్రపంచంలో ఏడు వింతల్లో ఒకటైన తాజ్ మహల్ వీక్షించేందుకు వచ్చే పర్యాటకుల సంఖ్య తగ్గినట్లు యూపీ పర్యాటకశాఖ తెలిపింది. ఉత్తరప్రదేశ్ లో అత్యధికంగా ఆగ్రా లోని తాజ్ మహల్ కు పర్యాటకులు వచ్చేవారని, ఈ స్థానంలో అయోధ్య రామాలయం చేరిందని పేర్కొంది. 2024 జనవరి నుంచి సెప్టెంబర్ వరకు అయోధ్యకు 13.55 కోట్ల మంది వస్తే, తాజ్ మహల్ చూసేందుకు 12.51 కోట్ల మంది పర్యాటకులు వచ్చారు అని UP ప్రభుత్వం పేర్కొంది.
