FLASH NEWS

ఘనంగా జరిగిన రచయిత సత్యదేవ్ జంగా పుట్టినరోజు వేడుకలు

టాలెంటెడ్ రైటర్ సత్యదేవ్ జంగా నాని నటించిన శ్యామ్ సింగ రాయ్ సినిమాకు కథను అందించారు. ఏప్రిల్ 6న తన పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో.. దర్శకుడు మారుతి, నిర్మాత రాధ మోహన్, సినిమాటోగ్రఫర్ కె.కె.సెంథిల్ కుమార్, రచయితలు డార్లింగ్ స్వామి, లక్ష్మీ భూపాల, బివిఎస్ రవి, సంగీత దర్శకులు ఆర్.పి.పట్నాయక్, ఆర్ ఆర్ ధ్రువన్, సింగర్ శ్రీరామ చంద్ర, నటులు రచ్చ రవి, అశ్విన్ బాబు, సింగర్ కౌసల్య, దర్శకులు వీర శంకర్, రచయిత కాసర్ల శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. రచయిత సత్యదేవ్ జంగా నేను ఏ ఫిలిం బై అరవింద్ సినిమా కథ రచయితగా పరిచయం అయ్యారు, ఆ సినిమా తరువాత ఆదిత్య మ్యూజిక్ కంపెనీలో సీనియర్ మేనేజర్ గా 20 ఏళ్ళు వర్క్ చేశారు. టాప్ సింగర్స్ తో 200 ప్రవేట్ ఆల్బమ్స్ చేశారు. ఆ తరువాత నాని సాయి పల్లవి నటించిన శ్యామ్ సింగా రాయ్ సినిమాకు కథ అందించారు. ఈ సినిమా ద్వారా సత్యదేవ్ జంగా కు రచయితగా మంచి పేరు వచ్చింది. ప్రస్తుతం ఎంఎల్ఏ , నేనే రాజు నేనే మంత్రి నిర్మాత భరత్ చౌదరి గారి కరణ్ సి ప్రొడక్షన్స్ లో ఆకెళ్ల వంశీ దర్శకత్వంలో ఒక థ్రిల్లర్ సినిమాకు కథ అందించబోతున్నారు. ఆయన అన్ని రకాల జానర్స్ లో కథలు రెడీ చెయ్యడం జరిగింది, ఈ ఏడాది మంచి సినిమాలతో రాబోతున్నారు, సూపర్ నేచురల్, మైథలాజికల్ థ్రిల్లర్స్, హర్రర్ జానర్స్ తో పాటు ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ జానర్స్ కథలు సిద్ధం చెయ్యడం జరిగింది, వాటి వివరాలు త్వరలో తెలియజేయనున్నారు.

ఘనంగా జరిగిన “లవ్ యువర్ ఫాదర్” ప్రీ రిలీజ్ ఈవెంట్

– ఏప్రిల్ 4న విడుదల దివంగత లెజెండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తనయుడు సింగర్ ఎస్పీ చరణ్ చాలా ఏళ్ళ తర్వాత ‘లైఫ్’ (లవ్ యువర్ ఫాదర్) అనే సినిమాతో మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తున్నారు. మనీషా ఆర్ట్స్, అన్నపరెడ్డి స్టూడియోస్ బ్యానర్స్ పై కిషోర్ రాఠీ, మహేష్ రాఠీ, రామస్వామి రెడ్డి నిర్మాతలుగా పవన్ కేతరాజు దర్శకత్వంలో ఈ లైఫ్ (లవ్ యువర్ ఫాదర్) సినిమా రాబోతుంది. శ్రీహర్ష, కషిక కపూర్ జంటగా ఎస్పి చరణ్, నవాబ్ షా, ప్రవీణ్, భద్రం, రఘుబాబు, షకలక శంకర్, రియా.. వంటి నటీ నటులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు. ఇక ఈ సినిమాకు సీనియర్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించారు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ కి ముఖ్య అతిధిగా ఎమ్మెల్యే మల్లా రెడ్డి గారు వచ్చారు. ఈ సందర్బంగా హీరో శ్రీ హర్ష మాట్లాడుతూ.. ముందుగా ముఖ్య అతిధి మల్లా రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలిపారు. మల్లా రెడ్డి గారు ఈ సినిమాలో నటించి ఉంటే బాగుండని కోరారు. ఆయన ఈ సినిమాలో నటించి ఉంటే, పాన్ వరల్డ్ సినిమా అయ్యేదని, ఆయన నటించకపోవడం వల్ల పాన్ ఇండియా సినిమా అయ్యిందని అన్నారు. అలాగే శ్రీ హర్ష ఈ సందర్బంగా తన తల్లి దండ్రులను గుర్తు చేసుకున్నారు. ఈ సినిమాని నిర్మించిన తన తండ్రి రామ స్వామి రెడ్డికి కృతజ్ఞతలు తెలిపాడు. ఈ సినిమాని ఇంత అద్భుతంగా తీసిన డైరెక్టర్ పవన్ కేతరాజుకి ఎంతో రుణపడి ఉంటాననని అన్నారు. మణి శర్మ లాంటి మ్యూజిక్ డైరెక్టర్ తన సినిమాకి సంగీతం ఇవ్వడం తన అదృష్టమని అన్నారు. అలాగే సింగర్ ఎస్పీ చరణ్, నటుడు ప్రవీణ్ తో కలిసి పని చెయ్యడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. వారితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.అలాగే ఈ సినిమాలో తనతో పని చేసిన కో స్టార్స్ కి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తనని, తన సినిమాని ఆదరించాలని, తనని ఎల్లప్పుడూ దీవించాలని ప్రేక్షకులను శ్రీ హర్ష కోరారు. ఇక ఎమ్మెల్యే మల్లా రెడ్డి గారు మాట్లాడుతూ.. ముందుగా ప్రేక్షకులకు నమస్కారాలు తెలిపారు. ఈ సినిమాని పాన్ ఇండియా భాషల్లో తీశారని తెలిసి ఆశ్చర్యపోయా అన్నారు. హీరో శ్రీ హర్ష తమిళ హీరో విజయ్ కంటే స్మార్ట్ గా ఉన్నారని అన్నారు. హీరోయిన్ కషిక కపూర్ మంచి కసి కసిగా బాగుందని సరదాగా అన్నారు. శ్రీ హర్ష తమ కాలేజీ స్టూడెంట్ అని, వాళ్ళ తండ్రి తమ కాలేజీ ప్రిన్సిపాల్ అని, వీళ్ళు సినిమా చెయ్యడం తనకు చాలా ఆనందంగా ఉందని అన్నారు. అలాగే ఈ సినిమాలో పని చేసిన నటినటులకి అభినందనలు తెలిపారు. డైరెక్టర్ ప్రవీణ్ కేతరాజుని ఇంత అద్భుతమైన సినిమా తీసినందుకు ప్రత్యేకంగా అభినందించారు. ఈ ఈవెంట్ కోసం తాను అసెంబ్లీ పనులు మానుకొని మరీ వచ్చానన్నారు. ఈ సినిమా కచ్చితంగా చాలా పెద్ద హిట్ అవ్వాలని, ప్రేక్షకులు ఈ సినిమాని ఆదరించి పాన్ ఇండియా హిట్ చెయ్యాలని ఎమ్మెల్యే మల్లా రెడ్డి కోరారు. ఇక డైరెక్టర్ పవన్ గారు మాట్లాడుతూ.. తమని దీవించడానికి వచ్చిన ముఖ్య అతిధి మల్లా రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ అవకాశం ఇచ్చినందుకు నిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే చరణ్ గారు ఈ సినిమా చేయబట్టే చాలా అద్భుతంగా వచ్చిందన్నారు. బాల సుబ్రహ్మణ్యం గారు చరణ్ గారిని మనకు గిఫ్ట్ గా ఇచ్చారని ఆయన్ని పొగడ్తలతో ముంచెత్తారు. బాల సుబ్రహ్మణ్యం గారు ఎక్కడున్నా కూడా చరణ్ గారిని, మమ్మల్ని దీవిస్తూ ఉంటారని అన్నారు. సినిమాలో చరణ్ గారి ప్రతి షాట్ ఎంజాయ్ చేశానని అన్నారు. బాలు గారు లేని లోటు చరణ్ తో తీరిపోయిందని అన్నారు. చరణ్ గారు ఇచ్చిన కోపరేషన్ వల్లే ఈ సినిమా ఇంత బాగా వచ్చింది అన్నారు. అలాగే నటుడు ప్రవీణ్ కి కూడా కృతజ్ఞతలు తెలిపారు. అలాగే రఘుబాబు, ఇతర నటి నటులకి కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా ఈ సినిమాకి పని చేసిన సీనియర్ టెక్నీషియన్స్ శ్యామ్ గారు, మణి శర్మ గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి టాప్ టెక్నీషియన్స్ తో పని చెయ్యడం తనకు చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఇక సింగర్ ఎస్పీ చరణ్ మాట్లాడుతూ.. వేదిక మీద ఉన్న పెద్దలందరికి నమస్కారం తెలిపారు. అలాగే ఈ సినిమాని హిట్ చేయబోతున్న ప్రేక్షకులకు నమస్కారం తెలిపారు. తన క్యారెక్టర్ ని అద్భుతంగా డిజైన్ చేసిన డైరెక్టర్ పవన్ కేతరాజు గారికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే నిర్మాతలు రామస్వామి రెడ్డి గారికి, కిషోర్ రాఠీ గారికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే హీరో శ్రీ హర్ష ఈ సినిమా కోసం చాలా కష్ట పడ్డారని, వారణాసిలో ఆయన పడ్డ కష్టాన్ని గుర్తు చేశారు. ఈ సినిమాతో శ్రీ హర్షకి మంచి సక్సెస్ ఇవ్వాలని ప్రేక్షకులని కోరారు.అలాగే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించినందుకు కషికకి థాంక్స్ చెప్పారు. అలాగే ఎంతో సపోర్టింగ్ యాక్ట్ చేసిన నటుడు ప్రవీణ్ కి కృతజ్ఞతలు తెలిపారు. షూటింగ్ లో ప్రవీణ్ తో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. స్టేజిపై చక్కగా పాట పాడారు. ఇంతమంచి సినిమాలో తాను పాడేందుకు అవకాశం ఇవ్వనందుకు కోపంగా ఉన్నానని సరదాగా అన్నారు. నిర్మాత కిషోర్ మాట్లాడుతూ.. ఎల్ వై ఎఫ్ సినిమాని ప్రేక్షకులు ఆశీర్వదించాలని కోరారు. మణి శర్మ గారికి, ఎస్పీ చరణ్ గారికి ఇంకా ఈ సినిమా కోసం పని చేసిన టెక్నీషియన్స్, ఆర్టిస్టులకి కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా డైరెక్టర్ పవన్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పారు. పవన్ సినిమాని చాలా బాగా తీశారని, ఈ సినిమా కచ్చితంగా అందరికీ నచ్చుతుందని అన్నారు. సినిమా పేరు : ఎల్ వై ఎఫ్ (లవ్ యువర్ ఫాదర్) నటీనటులు : శ్రీహర్ష, ఎస్పీ చరణ్, కేశిక కపూర్, ప్రవీణ్, చత్రపతి శేఖర్, రఘు బాబు, భద్రం, షకలక శంకర్, శాంతి కుమార్, బంటి తదితరులు. రచన, దర్శకత్వం : పవన్ కేతరాజు సంగీత దర్శకుడు : మణిశర్మ బ్యానర్స్ : అన్నపరెడ్డి స్టూడియోస్, మనిషా ఆర్ట్స్ & ప్రై లి నిర్మాతలు : కిషోర్ రాతి, మహేష్ రాతి, ఏ సామ్రాజ్యం, ఏ చేతన్ సాయిరెడ్డి ఆర్ట్ శంకర్ : చిడిపల్లి కాస్ట్యూమ్ డిజైనర్ : భావన పోలేపల్లి కాస్ట్యూమర్ : రాంబాబు కొరియోగ్రఫీ : మెయిన్ ఎడిటర్ : దేవరంపాటి రామకృష్ణ డిఓపి : శ్యామ్ కే నాయుడు పీఆర్వో : మధు వి ఆర్

అభివృద్ధి కోసం సీఎం రేవంత్ కి వినతిపత్రం అందజేసిన ఎమ్మెల్యే

– మాధవరం కృష్ణారావు కూకట్ పల్లి నియోజకవర్గం లోని పలు సమస్యల పరిష్కారానికి సత్వరం నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అసెంబ్లీ లోని ఆయన ఛాంబర్ లో కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. నూతన రోడ్ల నిర్మాణం, మురుగునీటి వ్యవస్థ, తాగునీటి నూతన పైప్ లైన్ల నిర్మాణం, పార్కులు, స్మశాన వాటికల నిర్మాణం సుమారుగా 25-30 కోట్ల రూపాయల నిధులను సత్వరం మంజూరు చేయాలని కోరారు. అదేవిధంగా కూకట్ పల్లి మండలం పరిధిలోని హైదర్ నగర్ గ్రామం సర్వే నెంబర్ 145,163 లలో నిర్మాణ అనుమతులను నిలిపివేసి స్థానికులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దశాబ్దాల కాలంగా ఏ పార్టీ అధికారంలో ఉన్నా గానీ ప్రభుత్వపరమైన అన్ని అనుమతులను జారీ చేశారని, ఇటీవల కాలంలో అకస్మాత్తుగా నిర్మాణ అనుమతులను నిలిపివేశారని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. మున్సిపల్ అధికారులు రెవెన్యూ అధికారులపై, రెవెన్యూ అధికారులు మున్సిపల్ అధికారులపై నెపం వేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న విషయం వివరించారు. అదేవిధంగా జేఎన్టీయూ వెనుక ఉన్న సాయి నగర్ కాలనీ వాసుల ఇళ్ల స్థలాల రెగ్యులరైజేషన్ విషయంలో ప్రభుత్వం దృష్టి సారించాలని, 2014 కు ముందు ప్రభుత్వం నిర్ణయించిన ధరల మేరకు డబ్బులు చెల్లించేందుకు కాలనీ వాసులు సిద్ధంగా ఉన్నారని వారికి న్యాయం చేయాలని కోరారు. అన్ని విషయాలను వివరంగా తెలుసుకున్న ముఖ్యమంత్రి వినతి పత్రాలను సంబంధిత అధికారులకు పంపిస్తానని త్వరలోనే పరిష్కారం చూపుతానని హామీ ఇచ్చారు.

తెలంగాణలో.. ఏప్రిల్ 1 నుండి సన్న బియ్యం

తెలంగాణ రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకు ఏప్రిల్ 1వ తేదీ నుంచి సన్నబియ్యం పంపిణీ చేయాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. ఈ పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఉగాది పండుగ రోజున సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్‌లో లాంఛనంగా ప్రారంభించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సన్నబియ్యం పంపిణీకి పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సన్నబియ్యం పంపిణీ చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చింది. అందుకు అనుగుణంగా రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీకి సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సొంత నియోజకవర్గ మైన హుజూర్ నగర్‌లో ఈ పథకాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్‌లో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ నెల 30న ఉగాది పర్వదినం సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆహ్వానం మేరకు సూర్యా పేట జిల్లా హుజూర్ నగర్‌కు సీఎం రేవంత్ వస్తున్నారు. రాష్ట్రంలో పేదలకు సన్న బియ్యం పంపిణీ చేసేందుకు ఏడాదికి 24 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం కావాలి. ఈ స్థాయిలో.. బియ్యం కావాలంటే 36 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అవసరం. ఏడాదిలో రెండు సీజన్లలో సేకరించే సన్నధాన్యాన్ని బియ్యంగా మార్చి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు పంపిణీ చేసేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 89.95 లక్షల రేషన్ కార్డులుండగా.. 2.81 కోట్ల మంది లబ్ధిదారులున్నారు.

ఘనంగా.. శ్రీ పెరుమాళ్ళ ఆంజనేయస్వామి ఆలయ వార్షికోత్సవం

ఆలయాలు అనేవి భారతదేశం ఆథ్యాత్మిక సంపద అని మౌలాలి డివిజన్ కార్పొరేటర్ గున్నాల సునీత శేఖర్ యాదవ్ అన్నారు. సోమవారం ఆమె, మౌలాలి డివిజన్ పరిధిలోని భరత్ నగర్ లోని శ్రీ పెరుమాళ్ళ ఆంజనేయస్వామి ఆలయ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై, స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ ఆలయాన్ని ఇంత అద్భుతంగా పురోభివృద్ధి చేసిన ఆలయకమిటిని అభినందించారు. తాను కార్పొరేటర్ గా విజయం సాధించిన ట్టు ప్రకటించగానే తన అనుచరులతో కలిసి మొదటగా దర్శనం చేసుకున్నది ఈ ఆల యాన్నే అని ఆమె గుర్తుకు చేసుకున్నారు. అప్పుడు ఈ ఆలయం చాలా దయనీయ స్థితిలో ఉండేదని, పురాతనమైన ఈ ఆలయాన్ని అద్భుతంగా రూపు దిద్దుకోవడానికి సహకరించిన దాతలకు, ఆలయ అభివృద్ధి కోసం కష్టపడ్డ కమిటీ సభ్యులకు, అలాగే ప్రతిరోజు ఆలయానికి వస్తున్న భక్తులందరికీ శుభాభినందనలు తెలిపారు. ఆలయ అభివృద్ధితో పాటు భరత్ నగర్, శ్రామిక నగర్ నెహ్రూ నగర్, గణేష్ నగర్ కాకుండా మౌలాలి లోని అన్ని కాలనీలు కూడా అభివృద్ధి చెందుతున్నాయని, గత నాలుగున్నర ఏళ్లుగా మౌలాలి డివిజన్ ప్రజలంతా చూస్తున్నారన్నారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులకు, అలాగే దాతలందరికీ కార్పొరేటర్ సునీత శేఖర్ యాదవ్ చేతులు మీదుగా శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పేదలకు ఆలయ ఆవరణలో అన్నప్రసాద వితరణ గావించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ శంకర్, మహేందర్, లోకేష్, ఎల్లం, రాజేష్ యాదవ్, కిరణ్ కుమార్, భాస్కరాచారి, రాందాస్ తదితరులు పాల్గొన్నారు.

ప్రణాళిక బద్ధంగా.. అభివృద్ధి పనులు

చంపాపేట డివిజన్ పరిధిలోని శుభోదయ కాలనీలో ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి వాటర్ వర్క్స్ అధికారులచే కలిసి సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి కి బస్తీవాసులు పలు సమస్యలను వివరించారు. దానిలో భాగంగా ఇట్టి కాలనీ నందు నూతన రోడ్ల నిర్మాణం కోసం రోడ్లు తవ్వడం జరిగింది అని తెలిపారు. కానీ ఇక్కడ డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరిచాక రోడ్లు వేయాలని, అనవసరంగా ముందే రోడ్లు తవ్వడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము అని తెలిపారు. కావున నూతన డ్రైన్స్ నిర్మాణం చేపట్టాక రోడ్లు వేయాలని కోరారు. అనంతరం సుధీర్ రెడ్డి మాట్లాడుతూ.. ఇట్టి రోడ్లు గతంలో మంజూరు చేయడం జరిగిందని, కానీ ఇక్కడ డ్రైన్స్ వ్యవస్థ సరిగ్గా లేదని తెలిసి తాత్కాలికంగా రోడ్డు నిర్మాణ పనులు అపి, నూతన డ్రైన్స్ నిర్మాణాలు చేశాక రోడ్లు వేద్దామని నిర్ణయం తీసుకోవడం జరిగింది అని అన్నారు. కావున ఇప్పుడు ఉన్న ఎనిమిది ఇంచుల డ్రైన్స్ స్థానంలో పన్నెండు ఇంచుల డ్రైన్స్ నిర్మాణం చేపట్టాలని అలాగే మిగిలిన మూడు గల్లీలలో ఎత్తుపల్లాలు సరిగ్గా చూసుకొని డ్రైన్స్ నిర్మాణం చేపట్టాలని అధికారులను ఆదేశించారు. డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరిచాక అనంతరం నూతన రోడ్ల నిర్మాణం పనులు చేపట్టడం జరుగుతుంది అని అన్నారు. అలాగే ఇట్టి డ్రైన్స్ పనుల్లో భాగంగా ఒక వారం, పది రోజులు కొంతమేర ఇబ్బందులు జరుగుతాయి కావున కాలనీవాసులు అధికారులకు మీ యొక్క సహాయ, సహకారాలు అందించాలని కోరారు. రాబోయే రోజుల్లో శుభోదయ కాలనీవాసులకు డ్రైన్స్ పనుల్లో శాశ్వత పరిష్కారం చేయడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో వాటర్ వర్క్స్ అధికారులు రమ్యభారతి, షబ్బీర్, శ్రీహరి, శ్రీనివాస్ మరియు పలువురు ప్రజాప్రతినిధులు, సీనియర్ భారస నాయకులు, మహిళలు, కాలనీవాసులు పాల్గొన్నారు.

నార్సింగీ ఔటర్ రింగ్ వద్ద కారు బీభత్సం

తెల్లవారుజామున.. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి గచ్చిబౌలి వెళుతున్న టాటా జైలో కారు నార్సింగీ వద్దకు రాగానే అదుపు తప్పి ఢీ వైడర్ ను ఢీ కొట్టింది. పల్టీలు కొట్టి.. అవతల వైపు ఎదురుగా వెళుతున్న టాటా సఫారి కారు ను ఢీ కొట్టింది. టాటా సఫారి కారులో ప్రయాణిస్తున్న 5 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలో మృతి చెందిన క్యాబ్ డ్రైవర్ రాజేంద్రనగర్ శివరాంపల్లికి చెందిన ఆనంద్ కాంబ్లీగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను హుటాహుటిన స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి ఓవర్ స్పీడే కారణమని పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనపై నార్సింగీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని తెలిపారు.

మహా ఘనంగా.. మహా భక్తి ఛానెల్ ఈవెంట్!

మహాన్యూస్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా కాజ సమీపంలోని శ్రీ దశావతార టెంపుల్ గ్రౌండ్స్ లో నిర్వహించిన శివోహం, మహా భక్తి ఛానల్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఎంతో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మంత్రి లోకేష్ గారు, శ్రీశ్రీశ్రీ మహా మండలేశ్వర్ కైలాసానంద గిరిజా మహారాజ్ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహా భక్తి టీవీ సాంగ్ ను ఆవిష్కరించారు. ఉపనిషత్తుల సారాంశాన్ని తెలిపే వెబ్ సైట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ.. మహా భక్తి ఛానల్ కోసం ఇంకా ఈ ఈవెంట్ కోసం పని చేసిన సిబ్బందిని మెచ్చుకున్నారు. వారికి ఎప్పుడు శివుని ఆశీస్సులు ఉండాలని కోరారు. కైలాష్ ఆనందగిరి స్వామీజీతో కలిసి ఈ వేడుకని జరుపుకోవడం పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నా అన్నారు. శివుని ఆశీస్సులు మన అందరిపైన ఉండాలని ప్రార్ధించారు. ఇంకా మహా టీవీ అధినేత వంశీ గారి గురించి మాట్లాడుతూ.. ఆంధ్రజ్యోతిలో రిపోర్టర్ గా పని చేసి నేడు మహా టీవీని స్థాపించి చరిత్ర సృష్టించారని వంశీ గారిని అభినందించారు. వంశీ గారు అసలు భయపడరని, ఆయనలోని పట్టుదల, తెలివి, కృషి తనని ఇంత గొప్పవాడిగా మార్చాయని అన్నారు. సామాన్య వ్వక్తి తలచుకుంటే ఏమైన సాధించవచ్చని వంశీ నిరూపించారని చంద్రబాబు నాయుడు అన్నారు. వంశీ గారికి అందరి తరపున మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపారు. మంత్రి నారా లోకేష్ గారు మాట్లాడుతూ.. మహాశివరాత్రి రోజున మహా భక్తి ఛానెల్ ప్రారంభం కావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమానికి వచ్చిన నిరంజనీ పీఠాధీశ్వర్ స్వామీజీ శ్రీశ్రీశ్రీ మహా మండలేశ్వర్ కైలాసానంద గిరిజా మహారాజ్ గారికి భక్తి పూర్వక నమస్కారాలు తెలియజేశారు. గిరిజా మహారాజ్ గారిని ఇక్కడ ఇలా కలుసుకోవడం, ఆయన ఆశీర్వాదం తీసుకోవడం గొప్ప అవకాశంగా భావిస్తున్నాని అన్నారు.శివుడ్ని తలచుకున్నా, అయన విగ్రహాన్ని చూసినా ధైర్యం వస్తుందని అన్నారు. నేడు మహా గ్రూప్ ఛానెళ్లకు మేనేజింగ్ డైరెక్టరుగా ఎదిగిన మారెళ్ల వంశీకృష్ణ గారిని ఈ సందర్భంగా మంత్రి లోకేష్ అభినందించారు. మహా కుంభమేళా ఆఖరి రోజున, మహా శివరాత్రి పర్వదినాన మొదలైన మహా భక్తి ఛానెల్ హిందూ ధర్మాన్ని కాపాడటానికి కృషి చేయాలన్నారు. ఛానెల్ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని యాజమాన్యానికి, సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే కైలాష్ ఆనందగిరి స్వామీజీ మాట్లాడుతూ.. ప్రజల మధ్యలో మహా టీవీ భక్తి ఛానెల్ ఉద్భవించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. మారెళ్ల వంశీకృష్ణ గారి ఆధ్వర్యంలో లింగాభిషేకం అద్భుతంగా జరిగిందని, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడం వారి అదృష్టం అని అన్నారు. ప్రజల సంక్షేమం కోసం ఈ కార్యక్రమంలో పాల్గొడం చాలా అదృష్టంగా భావిస్తున్న అన్నారు. అలాగే MP పెమ్మసాని గారు మాట్లాడుతూ.. మహా న్యూస్ అధినేత వంశీ గారి విజయవంతమైన ప్రయాణాన్ని అభినందించారు. తనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేశారు. ప్రజా సమస్యలపై వంశీ గారు చేసిన సేవలని ప్రశంసించారు. సాధారణ మండల స్థాయి జర్నలిస్ట్ నుంచి ఆధ్యాత్మిక టీవి ఛానల్ స్థాపన చేపట్టేలా ఎదిగినందుకు వంశీ గారిని మన స్ఫూర్తిగా అభినందించారు. ఇక మహా న్యూస్ చైర్మన్ వంశీ గారు మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం జరపడం మహా అందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలని అభినందించారు. ఈ మహోత్తర కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, కైలాష్ ఆనందగిరి స్వామీజీకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు. మహా భక్తి ఛానల్ ని ఏర్పాటు చెయ్యడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ఇక ఈ మహా కార్యక్రమం ఇంత సక్సెస్ కావడానికి ఆర్ట్ డైరెక్టర్లు హరివర్మ, మల్లి ప్రధాన కారణం అని చెప్పుకోవాలి. ఫిబ్రవరి 8 నుంచి కష్టపడుతూ ఫిబ్రవరి 26 లోపు ఆర్ట్ వర్క్ ని పూర్తి చెయ్యడం నిజంగా అభినందించదగ్గ విషయం. వీళ్లు గతంలో పలు సినిమాలకు ఆర్ట్ డైరెక్టర్లుగా కూడా పని చేశారు. వాళ్లకి ఉన్న అనుభవంతో ఈ కార్యక్రమాన్ని తమ ఆర్ట్ తో పరిపూర్ణంగా చేశారు.

అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలి: ఇలంబర్తి

హైదరాబాద్, ఫిబ్రవరి 27: అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండలని జిహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి అధికారులను ఆదేశించారు. జోనల్, డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో అందుబాటులో ఉండలని, అధికారులు సిబ్బంది సమయ పాలన పాటించాలని అందుకు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (A I) సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలని అన్నారు. హెడ్ ఆఫీసులో హెచ్ఓడి లు కూడా అందుబాటులో ఉండేందుకు సిసి కెమెరాలు ఏర్పాటు చేసినట్లు కమిషనర్ తెలిపారు. జోనల్, డిప్యూటీ కమీషనర్ కార్యాలయాల్లో కూడా సిసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఐటి అడిషనల్ కమీషనర్ ను కోరారు. హెడ్ ఆఫీస్ లో.. హెచ్ఓడి లు అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టి అదేవిధంగా జోనల్, డిప్యూటీ కమిషనర్ కార్యాలయాలకు మీరే భాధ్యత కాబట్టి అధికారులు, సిబ్బంది సమయ పాలన పాటించే విదంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీకి ఎన్నికైన వారికి సర్టిఫికేట్లు ప్రధానం

హైదరాబాద్, ఫిబ్రవరి 25: జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీకి ఎన్నికైన వారికి మంగళవారం సర్టిఫికెట్లను ప్రధానం చేసారు. జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ సభ్యుల ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగిన నేపథ్యంలో గెలుపొందిన వారికి సెక్రటరీ సత్యనారాయణ ఆధ్వర్యంలో సర్టిఫికెట్లను అందజేశారు. ఈ పంపిణీ కార్యక్రమంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి పాల్గొన్నారు. స్టాండింగ్ కమిటీ సభ్యులుగా గెలుపొందిన 15 మందిలో 10 మందికి సర్టిఫికెట్ అందజేశారు. చర్లపల్లి కార్పొరేటర్ బొంతు శ్రీదేవి, హస్తినాపురం కార్పొరేటర్ బాణోత్ సుజాత, అక్బర్ బాగ్ కార్పొరేటర్ సయ్యద్ మిన్హా జుద్దీన్, చాంద్రాయణగుట్ట కార్పొరేటర్ అబ్దుల్ వాహాబ్, ఘాన్సీ బజార్ కార్పొరేటర్ ప్రవీణ్ సుల్తానా, దూద్ బౌలి కార్పొరేటర్ మహమ్మద్ సలీమ్, టోలి చౌకి కార్పొరేటర్ డా.ఆయేషా హుమేరా, హిమాయత్ నగర్ కార్పొరేటర్ మహాలక్ష్మి రామన్ గౌడ, రహమత్ నగర్ కార్పొరేటర్ సి.ఎన్.రెడ్డి, రామచంద్రపురం కార్పొరేటర్ బురుగడ్డ పుష్ప ఉన్నారు.