ఆర్ కె నగర్ లో.. రూ 52 లక్షలతో సీసీ రోడ్డు పనులు ప్రారంభం

హైదరాబాద్, ఫిబ్రవరి 24: మల్కాజిగిరి డివిజన్ పరిధిలోని అన్ని కాలనీలలో మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నానని కార్పొరేటర్ శ్రవణ్ తెలిపారు. సోమవారం ఆర్ కె నగర్ స్ట్రీట్ నెంబర్ 3 లో రూ 52 లక్షల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా కార్పొరేటర్ మాట్లా డుతూ.. దశల వారీగా అభివృద్ధి పనులను చేపడుతున్నట్లు చెప్పారు. ప్రధానంగా రోడ్లు, డ్రైనేజీ, తాగు నీరు, వాడుక నీరు విద్యుత్ తదితర సౌకర్యాల కల్పనకు తగిన చర్యలు తీసుకుం టున్నానని ఆయన చెప్పారు.

ప్రజల సమస్యలను జీహెచ్ఎంసీ సమావేశంలో.. మేయర్, అధికారుల దృష్టికి తీసుకుని వెళ్ళి, కోట్లాడి నిధులు తీసుకుని వచ్చి సదుపాయాలు కల్పిస్తున్నట్లు కార్పోరేటర్ వెల్లడించారు. కాలనీలో నూతనంగా చేపట్టిన సీసీ రోడ్ల పనులను నాణ్యతతో, సకాలంలో పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు శివానంద్, మధు, రాంబాబు, హరీష్, డిపెందర్ సింగ్, జయంతి, సందీప్, మురళి కృష, ఏఈ నవీన్, మహేష్, రమేష్, జైశ్రీరామ్ వేణు, నందు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News