మైత్రి నగర్ పార్కు.. పునరుద్ధరించి వినియోగంలోకి తీసుకురావాలి

హైదరాబాద్, ఫిబ్రవరి 23: ప్రజా అవసరాల కోసం ఏర్పాటు చేసిన పార్కు నేడు నిరుపయోగంగా మారిందని . చెత్తా చెదారాలతో, పగిలిపోయిన బీరు బాటిళ్లతో దర్శనమిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని శేరిలింగంపల్లి జనసేన పార్టీ ఇంచార్జి కే.మాధవరెడ్డి వాపోయారు. నమస్తే శేరిలింగంపల్లి కార్యక్రమంలో భాగంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని మైత్రి నగర్లో పార్కలను జనసేన పార్టీ ఇంచార్జి మాధవరెడ్డి సందర్శించి కాలనీ వాసులను స్థానికులను సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు ఆహ్లాదవాతావరణం, ప్రశాంతత కోసం ఉద్యానవనాలు ఉపయోగపడతాయనే ఉద్దేశంతో పార్కులను ఏర్పాటు చేయాలి కానీ మైత్రి నగర్ లో ని పార్కును సందర్శిస్తే మాత్రం అందుకు విరుద్దంగా ఉందని అన్నారు. అధికారులు పట్టించుకోకపోవడంతో పార్కు చెత్తాచెదారంతో నిండిపోయి డంపింగ్ యార్డ్ లా మారిపోయాయని దీంతో స్థానికులు దోమలతోనూ ఇబ్బంది పడడమే కాకుండా అనారోగ్యాలకు గురవుతున్నారన్నారు. పార్కులో కొంతమంది యువకులు సిగరెట్లు, మద్యం సేవించి, అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

స్థానిక కార్పొరేటర్, అధికారులు స్పందించి నిరుపయోగంగా ఉన్న పార్కును అభివృద్ధి చేసి, పార్కును పునరుద్ధరించి వినియోగంలోకి తీసుకురావాలని మాధవరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో హఫీజ్ పేట్ డివిజన్ జనరల్ సెక్రటరీ నిరంజన్, చందా నగర్ డివిజన్ అధ్యక్షులు బి అరుణ్ కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఉలిసి శ్రీనివాస్ రావు, కొండాపూర్ డివిజన్ సుధాకర్, మియాపూర్ డివిజన్ అధ్యక్షులు హరి నాయక్, వివిధ కో ఆర్డినేటర్లు, నాయకులు, జన సైనికులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News