హైదరాబాద్, ఫిబ్రవరి 12: సచివాలయంలోని ఐదో ప్లోర్ సౌత్ భాగంలోని పట్టీ కూలింది. దీంతో రామగుండం మార్కెట్ కమిటీ చైర్మన్ వాహనం దెబ్బతింది. ఈ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడడం తో పెను ప్రమాదం తప్పింది. పట్టీ మొత్తం కూలే అవకాశం ఉండడంతో వెంటనే మరమ్మతులు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పటికే సచివాలయంలో అక్కడక్కడ వాటర్ లీకేజీ అవుతుండడంతో గోడలు పెచ్చులూడుతున్నాయి.
ఈ నేపథ్యంలోనే కొన్నిచోట్ల మరమ్మతులు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం సచివాలయ నిర్మాణానికి రూ.1200 కోట్ల ఖర్చు కాగా, ఈ నిర్మాణం నాసిరకం అంటూ అప్పట్లో కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. సచివాలయం ప్రారంభం రోజే అప్పటి పిసిసి అధ్యక్షుడు, ప్రస్తుత సిఎం రేవంత్రెడ్డి బిఆర్ఎస్ ప్రభుత్వం సచివాలయ నిర్మాణంపై విమర్శలు చేశారు.