హైదరాబాద్, ఫిబ్రవరి 12: ఈ నెల 15 న మహావీర్ సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి నిర్వహించనున్నారు. ఏటా ప్రభుత్వం అధికారికంగా దీనిని నిర్వహిస్తోంది. ఉత్సవాల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మంత్రి సీతక్క, గిరిజన సంఘాల ముఖ్య నాయకులు కలిశారు. ఉత్సవాల్లో పాల్గొనాల్సిందిగా ఆహ్వానం అందించారు. ఈ మేరకు సిఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు.
