- ఐజి కార్యాలయానికి అటాచ్డ్
హైదరాబాద్, ఫిబ్రవరి 12: నార్సింగ్ డిఐ (డిటెక్టివ్ ఇన్స్పెక్టర్) శ్రీనివాస్ను సైబరాబాద్ సీపీ ఐజి కార్యాలయానికి అటాచ్ చేశారు. లావణ్యతో తరచూ వాట్సాప్లో వీడియో కాల్స్ మాట్లాడుతూ శ్రీనివాస్ పరిచయం పెంచుకున్నారు. ఈ నేపథ్యంలో ఆ ఇద్దరి ఆడియో కాల్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీస్ ఉన్నతాధికారులు విచారణ జరిపారు. విచారణలో డిఐ శ్రీనివాస్ లావణ్యతో మాట్లాడింది నిజమే అని తేలడంతో అతనిని ఐజి ఆఫీసుకు అటాచ్ చేశారు.. లావణ్య నటుడు రాజ్ తరుణ్పై ఫిర్యాదు చేసినప్పటి నుంచి శ్రీనివాస్తో ఆమె పరిచయం పెరిగింది. తరచూ ఇద్దరూ ఫోన్లో వీడియో కాల్స్.. ఆడియో కాల్స్ మాట్లాడుతున్నారు. అవి సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో సైబరాబాద్ సీపీ శ్రీనివాస్పై ఈ మేరకు చర్యలు తీసుకున్నారు.