హైదరాబాద్, ఫిబ్రవరి 11: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ వరంగల్ పర్యటన రద్దయింది. మంగళవారం సాయంత్రం ఆయన హైదరాబాద్ వచ్చి.. ఆ తర్వాత వరంగల్ వెళ్లనున్నట్లు పార్టీ వర్గాలు తొలుత తెలిపాయి. వరంగల్లో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలతో ఆయన సమావేశం కానున్నట్లు వెల్లడిరచాయి. అయితే పార్లమెంట్ సమావేశాల కారణంగా రాహుల్గాంధీ తన పర్యటనను తాజాగా రద్దు చేసుకున్నట్లు సమాచారం. వరంగల్ పర్యటన రద్దుతో కాంగ్రెస్ శ్రేణులు కొంత నిరుత్సాహం చెందారు.
