మాఘ పౌర్ణమితో.. కుంభమేళాకు పెరగనున్న రద్దీ

  • పౌర్ణమి రోజు నదీ, సముద్రస్నానాలకు శ్రేష్ఠం

ప్రయాగరాజ్‌, ఫిబ్రవరి 11: మాఘ పూర్ణిమ.. కారణంగా కుంభమేళాకు మరింతగా భక్తులు పోటెత్తనున్నారు. ఇప్పటకే రోజుకు కోటిన్నర వరకు పుణ్యస్నానాలకు వస్తున్నారని అంచనా. ఈ నెల 12న మాఘపూర్ణిమ కారణంగా మరింత రద్దీ పెరగనుంది. ఇప్పటికే వందల కిలోవిూటర్లు ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. హిందూ పురాణాల ప్రకారం ఈ రోజుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున భగవంతుడిని భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల ఆర్థిక బాధలు తొలగి అష్టశ్వైర్యాల సిద్ధి కలుగుతుందని చెప్తారు. పౌర్ణమి నాడు బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేసి సూర్య భగవానుడికి అర్ఘ్యం అర్పించడంఅ వసరమని అంటున్నారు. దీంతో త్రివేణి సంగమానికి భక్తులు పోటెత్తనున్నారు. స్నానానంతరం పూజా కైంకర్యాలను నిర్వహించుకోవడం ఆనవాయితీ. వీలైతే ఏదైనా దేవాలయాన్ని సందర్శించడం వల్ల శుభం కలుగుతుంది. ఈ రోజున చేసే గంగా స్నానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. కానీ, ఇది అందరికీ సాధ్యపడకపోవచ్చు. కాబట్టి వీలైనవారు నదీ స్నానం చేసుకుని శివకేశవులను ఆరాధించుకోవచ్చు.

మాఘ పౌర్ణమి రోజున మద్య మాంసాలకు దూరంగా ఉండాలి. ఎట్టిపరిస్థితుల్లో జీవహింస చేయరాదు. ఇనుప వస్తువులు, నల్లని బట్టలు, వెండి, పాలు, ఉప్పు, సూదులు, కత్తెరలు వంటి పదునైన వస్తువులు బయటకు ఇవ్వకూడదు. ఇలా చేయడం వల్ల శని, చంద్ర దోషాలు వస్తాయని చెప్తారు. వీలైతే వంటకాల్లో ఉల్లి, వెల్లుల్లిని తీసుకోకుండా ఉండాలి. విూ భోజనం విూరే వండుకోవడానికి ప్రయత్నించండి. ఇక ఇతరులను మోసగించడం, దూషించడం, శారీరకంగా, మాటలతో గానీ హింసించడం వంటివి చేయకూడదు. ఇతరులను అకారణంగా నిందించకూడదు. నల్ల దుస్తులు ధరించకూడదు. రాత్రి ఎక్కువ సమయం వరకు మేలుకుని ఉండకూడదు. ఈ రోజు కచ్చితంగా బ్రహ్మ ముహూర్తంలో స్నానం ఆచరించడానికి ప్రయత్నించడం మంచిదని అంటున్నారు. ఇది ఎంతో శ్రేష్ఠమైనదిగా నమ్ముతారు. అవసరంలో ఉన్నవారికి, పేదవారికి అన్న, వస్త్ర దానాలు చేయడం చాలా మంచింది.

విష్ణు మూర్తిని పూజించడం, పౌర్ణమి వెన్నెల్లో విష్ణు సహస్రనామం జపించడం ఎంతో మేలు చేస్తుంది. ఈ రోజు చేసే ఉపవాసం వల్ల ఎంతో పుణ్యం కలుగుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి. రోజున ఆహారం దానం చేసిన వారికి జీవితంలో ధనానికి, తిండికి లోటు ఉండదని నమ్ముతారు. లక్ష్మీదేవి వారింటిని ఐశ్వర్యంతో నింపుతుందని నమముతారు. పౌర్ణమి రోజున సౌందర్య సాధనాలను దానం చేయడం వల్ల భర్త పిల్లల ఆయుష్షు పెరుగుతుందని ఉత్తరాది ప్రజలు నమ్ముతారు. ఇలా చేయడం వల్ల లక్ష్మీ దేవి ప్రసన్నం కలుగుతుందని నమ్ముతారు. మాఠపౌర్ణమి సందర్భంగా కూడా కుంభస్నానానికి వస్తారు. మౌని అమావాస్యతో పాటు ఈరోజుకు కూడా విశేష ప్రాధాన్యం ఉంది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News