అవినీతి రాజకీయాలను ప్రజలే పాతరేయాలి !

వివిధ కేసుల్లో ఉన్న ప్రజాప్రతినిధులను తక్షణం రాజకీయాలకు దూరంగా చేయాల్సిన అవసరాన్ని తాజాగా సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో ప్రజాస్వామ్యవాదులను, లేదా భారత ప్రజలను హెచ్చరించింది. చట్టాలు చేసే ప్రజాప్రతినిధులు నేరస్తులు అయివుంటే ఆ చట్టాలు ఎలా ఉంటాయో ఊహించుకోవాలి. చట్టాలను తుంగలో తొక్కుతున్న వైనం చూస్తున్నాం. కోర్టు తీర్పులను కాలరాస్తున్న నేతలను చూస్తున్నాం. ఇలాంటి సమయంలో సుప్రీం ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు ప్రజలకు కనువిప్పు కావాలి. అవినీతి, క్రిమినల్‌ రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రజలంతా చైతన్యం కావాలి. మాకొద్దీ దగుల్బాజీ రాజకీయమని నినదించాల్సి ఉంది. మరో అన్నా హజారే లాగా ఉద్యమించాల్సి ఉంది. ప్రజలు తమ దేశం కోసం లేదా అవినీతి లేని రాజకీయం కోసం కొతం సమయం వెచ్చించాల్సి ఉంది. చిన్న లంచం తీసుకుంటేనే అరెస్ట్‌ చేసి బొక్కలో వేస్తున్న మనం..ఇప్పుడు క్రిమినల్‌ కేసులు, డబ్బులు స్వాహా చేసిన వారిని, ప్రజాధనం లూటీ చేసిన వారిని రాజకీయాల్లో కొనసాగించడం అవసరమా అన్నది చర్చించాలి.

ప్రజాప్రతినిధుల కేసుల వేగవంతంపై సుప్రీం కోర్టులో సోమవారం విచారణ జరిగింది. క్రిమినల్‌ కేసుల్లో దోషులుగా తేలిన నేతలు తిరిగి ఎన్నికల్లో పోటీ చేయకుండా జీవితకాల నిషేధం విధించాలని కోరుతూ అశ్వినీ ఉపాధ్యాయ్‌ 2016లో దాఖలు చేసిన పిల్‌పై జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా జస్టిస్‌ మన్మోహన్‌లతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం విచారణ జరిపింది. అమికస్‌ క్యూరీ విజయ్‌ హన్సారియా సమర్పించిన నివేదికను ధర్మాసనం పరిశీలించింది. 42 మంది లోక్‌సభ ఎంపీలపై క్రిమినల్‌ కేసులు ఉన్నాయని, కొన్ని చోట్ల ప్రజాప్రతినిధులపై 30 ఏళ్లుగా కేసులు పెండిరగ్‌లో ఉన్నాయని అమికస్‌ క్యూరీ తన నివేదికలో పేర్కొన్నారు. దేశంలో చాలా చోట్ల కేసుల విచారణకు ప్రత్యేక కోర్టులు లేవన్నారు. నిజానికి చట్టాలు చేసే పార్లమెంట్‌, అసెంబ్లీలో క్రిమనల్స్‌ లేదా కేసులు ఉన్నవారు మంచి చట్టాలు చేస్తారని అనుకోవడానికి లేదు. బెయిల్‌పై ఉన్న జగన్‌ ఐదేళ్లు సిఎంగా పాలన చేశారు. ఇష్టం వచ్చినట్లుగా అప్పులు చేశారు. తొమ్మిదిన్నరేళ్లు సిఎంగా ఉన్న కెసిఆర్‌ అనేక ఆర్థిక అవతవకలకు పాల్పడ్డారు.

ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయనే అన్నాహజారే జనలోక్‌పాల్‌ బిల్లు తేవాలని డిమాండ్‌ చేశారు. కానీ కోర్టు కేసుల్లో ఉన్న నేతలు మళ్లీ మళ్లీ ఎన్నికవుతూ…ఈ సదాశయాన్ని తుగంలో తొక్కారు. తమ విలాసాలకు డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు చేశారు. అందుకు కేజ్రీవాల్‌ నివాసం, విశాఖలో జగన్‌ కట్టించిన విలాసవంతమైన భవనాలే నిదర్శనం. ప్రజలు తిండికి, గుడ్డకు కష్టపడుతుంటే ..ప్రజాధనంతో జల్సాలు చేసే నేతలు దేశానికి అవసరమా అన్నది ప్రజలే ఆలోచించాలి. ఇకపోతే కేసులు ఎదుర్కొంటున్న నిందితులు ఏళ్లుగా విచారణకు రాకపోవడం, పదేపదే వాయిదాలు కోరుతుండటం జాప్యానికి మరో కారణమని నివేదికలో పొందుపరిచారు. దీనిపై సుప్రీం కోర్టు ధర్మాసనం స్పందిస్తూ క్రిమినల్‌ కేసులుంటే ఉద్యోగంలో చేరేందుకే అనర్హులని, అలాంటిది ప్రజా ప్రతినిధులుగా ఎలా అర్హులవుతారని తీవ్ర వ్యాఖ్యలు చేసింది.ఈ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం మరింత పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని, దానికి అనుగుణంగా ఉన్నత పరిష్కారం ఆలోచించాలని కూడా సూచించింది.

సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయకపోవడంపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. నిజానికి సుప్రీం వెలిబుచ్చిన అభిప్రాయాన్నే ఆనాడు అన్నాహజారే వెలిబుచ్చారు. రాజకీయ అవినీతిని తరిమేందుకు ప్రత్యేక కోర్టులు లేదా జనలోక్‌ª`పాల్‌ రావాలని డిమాండ్‌ చేశారు. నేను అవినీతికి వ్యతిరేకమని అంటున్న మోడీ కూడా దీనిగురించి పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇకపోతే రాజకీయ నేతలు తెలివిలో ఆరితేరారు. లాలూప్రసాద్పై కేసు రాగానే ఆయన భార్యను రంగంలోకి
దింపారు. తరవాత కుమారుడు రంగంలోకి దిగాడు. శిక్షపడిన వారిని పార్టీ పదవుల్లో ఉండరాదని చెబితే వారు తమ భార్యల ద్వారానో, మరెవరి ద్వారానో రిమోట్‌ కంట్రోల్‌తో పార్టీని నడిపిస్తున్నారు. అందువల్ల అన్ని రకాల పరిస్థితులను ఊహించి, కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, మేం తీసుకునే నిర్ణయం లోపభూయిష్ఠంగా ఉండరాదు. అలా ఉంటే తీర్పు ఎలాంటి ప్రభావం చూపకపోగా, వ్యవస్థపై ప్రజలు మరింతగా విశ్వాసం కోల్పోతారని కూడా సుప్రీంకోర్టు అభిప్రాయ పడింది.

అందుకే రాజకీయాలు నేరమయం కావడం తీవ్ర అంశమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. క్రిమినల్‌ కేసుల్లో దోషిగా తేలినవారు పార్లమెంటుకు ఎలా వస్తారని విస్మయం వ్యక్తం చేసింది. 42 శాతం మంది సిటింగ్‌ సభ్యులపై పెండిరగ్‌ కేసులుండడం సిగ్గుచేటని తెలిపింది. శిక్షపడ్డ ప్రజాప్రతినిధులపై కేవలంఆరేళ్ల పాటే అనర్హత వేటు వేసి వదిలేస్తే ఎలా అని కూడా సంశయించింది. వారిపై శాశ్వత వేటు వేయాలి.. చట్టాలు చేసేవారు పవిత్రంగా ఉండాలని వ్యాఖ్యానించింది. దోషిగా తేలిన వ్యక్తి రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా ఉండడం సరైనదేనా అని కూడా ప్రశ్నించింది. సుప్రీం అభిప్రాయం ప్రకారం నేరాలకు పాల్పడి శిక్ష పడ్డ రాజకీయ నేతలు చట్టసభల్లో పోటీ చేయకుండా శాశ్వతంగా నిషేధం విధించడం అవసరం. అప్పుడే మన ప్రజాస్వామ్యంలో కళంకితును దూరం చేయగలం. ఈ విషయంలో మూడు వారాల్లోగా అభిప్రాయాన్ని తెలపాలంటూ సుప్రీంకోర్టు కేంద్రాన్ని, ఎన్నికల కమిషన్‌ను ఆదేశించిన నేపథ్యంలో వారి అభిప్రాయం ఎలా ఉన్నా ప్రజలు ముఖ్యంగా ఓటేస్తున్న ఓటర్లు చర్చించాలి.

క్రిమినల్‌ కేసుల్లో ఉన్నవారిని నెత్తికి ఎత్తుకోవాల్సిన అవసరం ఉందా అన్నది విచారణ చేయాలి. రాజకీయాలు నేరమయం కావడం తీవ్రమైన అంశంగానే చూడాలి. చట్టసభల ప్రతినిధులపై కేసుల విచారణ వేగవంతం చేయాల్సిందే. నేరచరిత్ర ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలను శాశ్వతంగా చట్టసభల్లో ప్రవేశించకుండా వేటువేయాలనే సుప్రీం అభిప్రాయానికి అనుగుణంగా ఓటర్లు స్పందించాలి. జనం స్పందించాలి. నేరమయ రాజకీయాలకు పాతరేయాలి. ప్రతిపాదనపై కేంద్రం, ఎన్నికల కమిషన్‌ స్పందించాలని కోరినా అల ఆజరుగుందని అనుకోవడానికి లేదు. వారు సానుకూలంగా స్పందిస్తారని ఆశించడం కూడా అత్యాశే అవుతుంది. అదేదో ప్రజలే చేయాలి. నేరమయ రాజకీయ నేతలను దూరంగా పెట్టే చైతన్యంతో సాగాలి.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News