బీసీల ఓట్లు వేయించుకొని బూరడి కొట్టించిన కాంగ్రెస్‌

  • బిసిలకు 42శాతం రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే
  • అప్పటివరకు మా పోరాటం ఆగదు: కవిత

జగిత్యాల, ఫిబ్రవరి 10: ఐఫోన్‌కు చైనా ఫోన్‌కు ఎంత తేడా ఉందో.. కేసీఆర్‌, రేవంత్‌కు అంతే తేడా ఉందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. చైనా ఫోన్‌ చూడడానికే బాగుంటుంది.. కానీ సరిగ్గా పనిచేయదన్నారు. మాటలు చెప్పి బీసీల ఓట్లు వేయించుకొని బూరడి కొట్టిన సీఎం రేవంత్‌ రెడ్డి.. ఏ కులంలో ఎంత జనాభా ఉన్నారో లెక్కలు ఎందుకు బయటపెట్టడం లేదని అంటూ ప్రశ్నించారు. జగిత్యాలలో కవిత విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తూతూమంత్రంగా మంత్రి పొన్నం ప్రభాకర్‌ బీసీ సంఘాలతో సమావేశం పెట్టారని.. స్వయంగా ముఖ్యమంత్రి ఎందుకు సమావేశమవ్వడం లేదు ? ప్రశ్నించారు. బీసీ ఉద్యమం చేస్తున్న నాయకులతో ముఖ్యమంత్రి మాట్లాడకపోవడం బీసీలను అవమానించడమేనన్నారు. బీసీ కుల సంఘాలతో ముఖ్యమంత్రి చర్చలు జరపాలని.. 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చే వరకు ఉద్యమం ఆగదరన్నారు.

మరో తెలంగాణ పోరాటం తరహా పోరాటానికి బీసీలంతా సిద్ధంగా ఉండాలని.. తప్పుడు జనాభా లెక్కలు చెప్పడంతో బీసీ సమాజం అట్టుడుకుతోందన్నారు. సీఎం రేవంత్‌ రెడ్డి వెంటనే బీసీ కుల సంఘాలతో చర్చలు జరపాలని.. 52 శాతం బీసీలు ఉన్నారని 2014లోనే కేసీఆర్‌ లెక్క తేల్చారని..కానీ లెక్కపెట్టడం కూడా రాని రేవంత్‌ రెడ్డి సర్కారు తప్పుడు లెక్కలు చెబుతోందన్నారు. బీసీల సంఖ్యను తక్కువ చూపించడం శోచనీయమన్నారు. ఈ తప్పుడు లెక్కలు చెప్పి రాహుల్‌ గాంధీ పార్లమెంట్‌ను తప్పదోవ పట్టించారని.. స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి బిల్లు ఎందుకు పెట్టడం లేదు ? అంటూ నిలదీశారు. 420 హావిూలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ ప్రజలను వంచించిందని.. ఎండిపోయిన పోలాలను చూపిస్తూ రైతులు బాధపడుతున్నారన్నారు. ఎండిన పంటపొలాల ను చూస్తుంటే కన్నీళ్లు వచ్చే పరిస్థితి కేసీఆర్‌పై అక్కసుతో మేడిగడ్డ ప్రాజెక్టును వినియోగించడం లేదని.. రైతులను నీళ్లించే తెలివి లేదంటూ మండిపడ్డారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం రాజకీయ కక్షను పక్కనపెట్టి సీఎం రేవంత్‌ రెడ్డి కాళేశ్వరం నీళ్లను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆడపిల్లలు స్కూటీలు ఇస్తామన్నారని.. మహిళలకు రూ.2500 ఇస్తామని చెప్పి ఇంకా ఇవ్వలేదన్నారు. మహిళలను చిన్నచూపు చూస్తున్న రేవంత్‌ రెడ్డికి కాలం గుణపాఠం చెబుతుందన్నారు. రేవంత్‌ రెడ్డి తప్పులను ప్రజలు లెక్కిస్తున్నారని.. తగిన సమయంలో బుద్ధి చెబుతారన్నారు. అర్హులకు వెంటనే ఇండ్లు ఇవ్వాల్సిందేనన్నారు. రేషన్‌ కార్డులను ఎందుకు జారీ చేయడం లేదు ? మండిపడ్డారు. రుణ మాఫీ ఎక్కడా కూడా సంపూర్ణంగా కాలేదని.. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ బీఆర్‌ఎస్‌ పార్టీకి ద్రోహం చేసి కాంగ్రెస్‌లో చేరారన్నారు. అయినా కూడా మనోధైర్యంతో కార్యకర్తలు చెక్కుచెదరలేదని.. ఉప ఎన్నిక వస్తే జగిత్యాలలో కాంగ్రెస్‌ పార్టీ అడ్రస్‌ లేకుండా పోతుందన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News