- ఢిల్లీ ఫలితాలపై చంద్రబాబు వ్యాఖ్య
అమరావతి, ఫిబ్రవరి 8: ప్రధానమంత్రి నరేంద్రమోదీపై ఉన్న నమ్మకంతోనే దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా ఘన విజయం సాధించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. దిల్లీ ఎన్నికల ఫలితాలపై ఉండవల్లిలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విూడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. దిల్లీ ప్రజలు సరైన సమయంలో సరైన పార్టీని ఎన్నుకున్నారన్నారు. ‘1991 తర్వాత దేశంలో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. ఆర్థిక సంస్కరణలను తెలుగుబిడ్డ పీవీ తీసుకువచ్చారు. 1995-2024 మధ్య మన తలసరి ఆదాయం 9 రెట్లు పెరిగింది. సంపద సృష్టిస్తేనే ఆదాయం పెరుగుతుంది.. మౌలిక వసతులు వస్తాయి. తెలుగు రాష్టాల్లో 3వేల డాలర్ల (సుమారు రూ.2.63 లక్షలు) తలసరి ఆదాయం ఉంది.
బిహార్లో తలసరి ఆదాయం ఇంకా 750 డాలర్లే ఉంది. టెక్నాలజీ సాయంతో మనం ముందుకెళ్లాం. మనకు ఐటీ, మౌలిక వసతులు గేమ్ఛేంజర్గా మారాయి. సరైన సమయంలో సరైన నాయకత్వం చాలా కీలకం. సుపరిపాలన ఇస్తే మంచి రాజకీయాలకు నాంది పలికినట్టే. చాలా రాష్టాల్రను దాటుకుని గుజరాత్ తలసరి ఆదాయం పెరిగింది. స్థిరమైన పాలన, పాలసీలు, గ్రోత్ గుజరాత్ అభివృద్ధికి కారణం. కొందరు నాయకులు సంక్షేమ కార్యక్రమాల పేరుతో అవినీతి చేస్తున్నారు. కొందరు నేతల వల్ల రాజకీయాల్లో కాలుష్యం పెరుగుతోందని చంద్రబాబు వ్యాఖ్యానించారు.