జీతాలు చెల్లించకుంటే సమ్మెకు వెళ్తాం

హైదరాబాద్, ఫిబ్రవరి 4: తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలోని శానిటేషన్, పేషంట్ కేర్, సెక్యూరిటీ కార్మికుల జీతాలపై ప్రభుత్వం సంవత్సరానికి ఒకసారి మాదిరిగా జీతాలు చెల్లిస్తున్నదని, గత ఏడు నెలల క్రితం ఒకసారి సమ్మె నోటీసు ఇస్తే కొన్ని జీతాలు ఇచ్చిన ప్రభుత్వం మళ్ళీ గత ఏడు నెలలుగా కార్మికుల బిల్లులు చెల్లించకుండా జీతాలు ఇవ్వడంలో కాంట్రాక్టర్లు, అధికారులు తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారని ఏఐటీయూసీ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి ఎం నరసింహ విమర్శించారు. టీవీవిపీ ఆసుపత్రుల్లో జీతాలకై రోజు ఒక గంట నిరసన ధర్నాలో భాగంగా నేడు కింగ్ కోటి జిల్లా ఆస్పత్రిలో జరిగిన ధర్నా కార్యక్రమంలో వారు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం నుండి గత ఏడు నెలలుగా బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్లు కొద్ది నెలలు జీతాలు ఇచ్చి అనంతరం చేతులెత్తేసారని కాంట్రాక్టర్లకు, ప్రభుత్వానికి మధ్యలో కార్మికులు నలిగిపోతున్నారని నెల జీతం మీద పిల్లల చదువులు, ఇంటికిరాయిలకు ఆధారపడినటువంటి కార్మికులు జీతాలు అందక నానా ఇబ్బందులను పడుతున్న జనవరి 27న ఆందోళనకై టీవీవిపి కమిషనర్ కు నోటీసు ఇచ్చి ఆందోళనలు నిర్వహిస్తున్న ప్రభుత్వం, అధికారులు చలించటం లేదని ఇలాగే నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తే రాబోవు రోజుల్లో పనులను పూర్తిగా నిలిపివేసి నిరవధిక సమ్మెకు సైతం వెలనున్నట్లు వారు హెచ్చరించారు.

గత రెండున్నర సంవత్సరాల క్రితం పిలిచిన టెండర్ లో వీరి జీతాలు 13600 రావలసి ఉండగా కేవలం 11000 మాత్రమే జీతాలు చెల్లిస్తున్నారని, పిఎఫ్ డబ్బులను కూడా తక్కువగా చెల్లిస్తున్నారని ఈ విషయాలపై రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకుండా కార్మికులకు తీవ్ర అన్యాయం చేస్తున్నదని ప్రస్తుతం 19 జీతం రావాల్సి ఉన్నదని ప్రభుత్వం వెంటనే వీటి పైన స్పందించి కనీస వేతనాలు ప్రభుత్వాసుపత్రుల్లో పనిచేయుచున్న శానిటేషన్ పేషంట్ కేర్ సెక్యూరిటీ కార్మికులకు అందే విధంగా తగు చర్యలు తీసుకోవాలని ప్రతినెల 7వ తేదీ లోపు సక్రమంగా జీతాలు అందే విధంగా చూడాల్సినటువంటి ప్రభుత్వం పట్టించుకోకపోవడం తీవ్ర నిర్లక్ష్యమని వారు తెలియజేశారు. టీవీ విపి కార్మికులకు కూడా రాష్ట్ర ప్రభుత్వము నుండి జీతాలు అందే విధంగా కమిటీని ఏర్పాటు చేసిన ప్రభుత్వం దానిపై ముందడుగు వేయకుండా ఉందని వెంటనే వీరి సమస్యలపై స్పందించి రాష్ట్ర ప్రభుత్వం జీతాలను విడుదల చేయాలని లేని పక్షంలో రాబోవు రోజుల్లో నిరవధిక సమ్మెను రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించినట్లు వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించాలని పిఎఫ్, ఈఎస్ఐ సక్రమంగా జమ చేయాలని కనీస వేతనాల జీవోలను కార్మికులకు అమలు చేయాలని పెద్దపెటున్న నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో కార్మికులు సంతోష, ఎన్ లక్ష్మీ, కౌసల్యమ్మ, అంజమ్మ, ప్రకాష్, గణేష్, ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News