- ఆ లక్ష్యం దిశగా పయనిస్తున్నాం
- రాష్ట్రపతి ప్రసంగంలో ఇదే స్పష్టం చేశాం
- రాబోయే 25 ఏళ్ల కాలానికి ప్రజల్లో విశ్వాసం పాదుకొల్పాం
- తప్పుడు హావిూలతో ప్రజలను మోసం చేయడం లేదు
- కొందరు సెల్ఫీలు దిగుతూ..అద్దాల మేడల్లో ఉంటారు
- ప్రతి రూపాయి గ్రామానికి చేరుకునేలా చూస్తున్నాం
- రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానానికి మోడీ సమాధానం
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4: రాష్ట్రపతి ప్రసంగం ’వికసిత్ భారత్’ లక్ష్యంపై దేశ దృఢసంకల్పాన్ని పునరుద్ఘాటించిందని ప్రధాని మోడీ అన్నారు. రాష్ట్రపతి ప్రసంగం తమలో ఆత్మవిశ్వాసం నింపిందని, మరోసారి తమ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు ప్రజలకు కృతజ్ఞతలని చెప్పారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానానికి పధ్నాలుగు సార్లు సమాధానం ఇచ్చే అదృష్ట్యాన్ని దేశ ప్రజలు తనకు ఇచ్చారని, ఇందుకు తాను ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పార్లమెంటులో రాష్ట్రపతి చేసిన ప్రసంగంపై ధన్యవాద తీర్మానానికి లోక్సభలో ప్రధాని సమాధానమిస్తూ, మనం 2025లో ఉన్నారు. ఒకరకంగా 21వ శాతాబ్దంలో 25 శాతం ముగిసిపోయింది. 20వ శతాబ్దంలో స్వాతంత్యర్ర తరువాత, 21వ శతాబ్దంలో 25 ఏళ్లలో ఏం జరిగిందనేది కాలమే చెబుతుంది. రాష్ట్రపతి ప్రసంగాన్ని జాగ్రత్తగా గమనిస్తే, రాబోయే 25 ఏళ్లలో, వికసిత్ భారత్ దిశగా ప్రజల్లో విశ్వాసం పాదుకొలపే దిశగా పనిచేయనున్నాం. వికసిత్ భారత్ లక్ష్యాన్ని రాష్ట్రపతి ప్రసంగం ప్రతిబింబించింది.
సరికొత్త ధీమాను కల్పిస్తూ, సామాన్య ప్రజానీకానికి స్ఫూర్తిగా నిలిచిందని మోదీ అన్నారు. ’గరీబీ హటోవా’ నినాదంపై మాట్లాడుతూ. ప్రభుత్వం తప్పుడు హావిూలు ఇవ్వదని, ప్రజలకు నిజమైన అభివృద్ధిని అందిస్తుందని ప్రధాని అన్నారు. ఇంతవరకూ పేదలుకు 4 లక్షల గృహాలు ఇచ్చామని, గతంలో మహిళలు బహిర్భూమి సిస్టమ్ లేక అవస్థలు పడవారని, ఎవరైతే అన్ని సౌకర్యాలు ఉన్నారో వారికి ఇలాంటి అవసరాలు అర్థం కావని పరోక్షంగా ప్రతిపక్ష కాంగ్రెస్కు చురకలు వేశారు. పేదల కోసం 12 కోట్లకు పైగా మరుగుదొడ్లు నిర్మించామని అన్నారు. గత ఐదు దశాబ్దాలుగా 2కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి బయటపడేశామని చెప్పారు. అంకితభావంతో పథకాలు అమలు చేసినప్పుడే ఇలాంటి మార్పు సంభవమని అన్నారు. పేదల గురించి ఉత్తుత్తి హావిూలు తాము ఇవ్వమని, అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పారు. పేదలు, సామాన్య ప్రజలు, మధ్యతరగతి సవాళ్లను అవగాహన చేసుకుని, వాటిని అధిగమించేలా చేసేందుకు కట్టుబడి ఉంటామని చెప్పారు. ’ప్రజల సొమ్ము ప్రజల చేతికే‘ అనేది మా నినాదం.
డిజిటల్ సాంకేతికత ద్వారా పారదర్శకత పెంచాం. పది కోట్ల నకిలీ ఖాతాలను గుర్తించి తొలగించాం. ఇథనాల్ బ్లెండిరగ్ ద్వారా విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేశాం. గతంలో తరచూ రూ.లక్షల కోట్ల అవినీతిపై రోజూ వార్తలు వచ్చేవి. గత పదేళ్లుగా కేంద్ర ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలే లేవు. మా హయాంలో మౌలిక వసతుల కల్పనపై భారీగా వెచ్చించాం. కేంద్రంలో పదేళ్లుగా అవినీతి లేకపోవడంతో జనం లాభపడ్డారు. ఆయుష్మాన్ భారత్, జన్ ఔషధి కేంద్రాల ఏర్పాటుతో రోగులకు ఎంతో మేలు జరిగిందన్నారు. మా హయాంలో ప్రతి రూపాయిని ప్రజల కోసమే ఖర్చు చేస్తున్నాం. ప్రజల డబ్బును మేం అద్దాల మేడలు నిర్మించడానికి ఉపయోగించలేదు.. దేశాభివృద్ధికి వినియోగించాం. ప్రపంచ గేమింగ్ రాజధానిగా భారత్ తయారవుతోంది. మే అధికారంలోకి రాకముందు ఎల్ఈడీ బల్బు ధర రూ.400 ఉండేది. మా ప్రభుత్వం రాగానే ఎల్ఈడీ బల్బును రూ.40కే పంపిణీ చేశాం. దీని ద్వారా దేశ ప్రజలకు రూ.20వేల కోట్లు ఆదా అయింది. మా పాలన బాగుండటం వల్లే మళ్లీ గెలుస్తున్నాం.
హరియాణాలో మూడోసారి అధికారంలోకి వచ్చాం. మహారాష్ట్రలోనూ తిరిగి అధికారంలోకి వచ్చాం‘అని ప్రధాని వివరించారు. అలాగే ప్రధాని తన ప్రసంగంలో రాహుల్ గాంధీ, కేజీవ్రాల్పై పరోక్ష విమర్శలు గుప్పించారు. రాష్ట్రపతి ప్రసంగం బోరింగ్గా ఉందంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను పరోక్షను ప్రస్తావిస్తూ, పేదల గుడిసెల్లో ఫోటో సెషన్లతో సరదాగా గడిపేవారికి పార్లమెంటులో పేదల గురించి మాట్లాడుతూ చేసే ప్రసంగాలు బోర్గానే ఉంటాయని అన్నారు. కొందరు నాయకులు విలాసవంతమైన షవర్లు కోరుకుంటారని, తమ ప్రభుత్వం మాత్రం ప్రతి ఇంటికి నీళ్లు ఇవ్వడంపై దృష్టిసారిస్తుందని కేజీవ్రాల్ విలాసవంతమైన శీష్ మహల్ పై పరోక్ష విమర్శలు గుప్పించారు. ఢిల్లీ నుంచి రూపాయి పంపితే గ్రామలకు 16 పైసలే చేరుతోందని గతంలో ఒక ప్రధాని వాపోయారని, ఢిల్లీ నుంచి గల్లీ వరకూ అప్పట్లో అదే పరిస్థితి ఉండేదని ప్రధాని అన్నారు. అయితే ఇప్పుడు ఢిల్లీ నుంచి రూపాయి పంపితే గ్రామానికి రూపాయి అందుతోందని, నగదు బదిలీతో నేరుగా ప్రజలకే సొమ్ము అందుతోందని వివరించారు. ప్రధాని ప్రసంగిస్తున్నంత సేపు అధికారపక్షం సభ్యులు చప్పట్లతో అభినందించారు.