ప్రముఖ సీనియర్ నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బూ తాజాగా గాయాలపాలైంది. ఆమె చేతికి కట్టుతో ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో, అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆమె ఫోటోని షేర్ చేసిన క్షణాల్లోనే, ఏమైందంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఖుష్బూ తన చేతికి గాయం అయిందన్న విషయాన్ని స్వయంగా సోషల్ మీడియాలో పోస్ట్ ద్వారా వెల్లడించింది. అయితే ఆ పోస్టులో గాయం ఎలా అయ్యింది? ఎప్పుడు జరిగింది? అసలేం జరిగింది? అనే విషయాన్ని మాత్రం ఆమె వెల్లడించకపోవడంతో అభిమానులు టెన్షన్ పడుతున్నారు.
కానీ అదే పోస్ట్ లో ఫోటోతో పాటు ‘‘అనుకోని గాయాలు మన ప్రయాణాన్ని ఆపాలని చూస్తాయి. కానీ మనం మాత్రం ఆగిపోవద్దు… చిరునవ్వుతో ముందుకు సాగాలి’’ అంటూ పాజిటివ్ గా రాసుకొచ్చింది. ఖుష్బూ చేసిన ఆ పోస్టులో ఆమె చేతికి కట్టు కట్టి ఉన్నట్టుగా కనిపిస్తోంది. అయితే ఇంతటి గాయమైనప్పటికీ ఖుష్బూ ఏమాత్రం టెన్షన్ పడకుండా, చెదరని చిరునవ్వుతో ధైర్యంగా కనిపిస్తుండడం విశేషం. అయితే ఆమెకు ఈ గాయం ఎలా అయింది? అన్న విషయం మాత్రం ఇంకా సస్పెన్స్ గా మారింది.