రేపే వసంత పంచమి.. అక్షరాభ్యాసాలకు బాసర సిద్దం

బాసర, ఫిబ్రవరి 1: మాఘమాసం మొదలైంది. ఈ నెలలోనే చదువుల తల్లి సరస్వతి పుట్టిన రోజు వచ్చింది. అయితే వసంతపంచమి కూడా ఏ తేదీ అన్న విూమాంస ఏర్పడింది. ఈ ఏడాది వసంత పంచమి ఫిబ్రవరి2వ తేది వచ్చింది. ఆ రోజును వసంత పంచమి అంటారు. హిందూ మతానికి చెందిన చదువుకునే పిల్లలు వసంతపంచమి రోజు సరస్వతి దేవిని పూజిస్తారు. కొత్తగా చదువులోకి అడుగుపేట్టేవారికి ఆరోజు అక్షరాభ్యాసం చేయిస్తారు. ఇందుకోసం ప్రసిద్ద పుణ్యక్షేత్రం బాసరలో భారీగా ఏర్పాట్లు చేశారు. ప్రతి సంవత్సరం మాఘ మాసం శుక్లపక్షం 5వ తిధిన వసంత పంచమి జరుపుకుంటాం. క్రోధినామ సంవత్సరంలో వసంత పంచమి ఘనంగా జరుపుకుంటున్నారు. సరస్వతీదేవిని విశేషంగా పూజించి, ప్రత్యేకంగా నైవేద్యాలను సమర్పించి, పిల్లలకు విద్యాబుద్ధులు రావాలని, వారు ఉన్నతంగా ఎదగాలని కోరుకుంటారు. ధృక్‌ పంచాంగం ప్రకారం.. ఫిబ్రవరి 2 ఆదివారం మధ్యాహ్నం నుంచి పంచమి తిథి మొదలైంది.. ఫిబ్రవరి 3 సోమవారం ఉదయం 10.15 వరకు మాత్రమే ఉంది.

సూర్యోదయానికి తిథి పరిగణలోకి తీసుకుంటాం కాబట్టి..వసంతపంచమి ఫిబ్రవరి 3 సోమవారమే జరుపుకోవాలని కొందరి వాదన. అక్షరాభ్యాసాలు నిర్వహించేవారు, ప్రత్యేక పూజలు చేసేవారు ఫిబ్రవరి 3 వతేదిఉదయం పది గంటల లోపే ముగించుకోవాలని పండితులు సూచిస్తున్నారు. వసంత పంచమి రోజున చిన్నారులకు అక్షరాభ్యాసం చేయిస్తే విద్యాంతులు అవుతారని భక్తుల నమ్మకం. అందుకే వసంత పంచమి ఘడియల్లో అక్షరాభ్యాసానికి ముహూర్తంతో సంబంధం లేకుండా చూడకుండా అక్షరాభ్యాసాలు చేస్తారు. ఆరోజు సరస్వతి దేవి చదువుల తల్లి పుట్టిన రోజు కాబట్టి సరస్వతీ దేవి ఆరాధన వల్ల వాక్శుద్ధి కలుగుతుంది. ఆలోచన, ప్రతిభ, ధారణ, ప్రజ్ఞ, స్ఫురణ శక్తి…వీటి స్వరూపమే సరస్వతీదేవి. అమ్మ అనుగ్రహం ఉంటే సద్భుద్ధిని పొందుతారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News