- ప్రత్యే దృష్టితో వరాలు కురిపించిన నిర్మలమ్మ
- బడ్జెట్లో పలు పథకాలు ప్రకటించిన కేంద్రమంత్రి
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: ఈ ఏడాది చివర్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. అక్కడ ప్రస్తుతం నితీశ్ కుమార్ నేతృత్వంతోని ఎన్డిఎ సర్కార్ ఉంది. అక్కడ మరోమారు అధికారం కోసం ఎన్డిఎ ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం బీహార్లో జేడీయూతో కలిసి బీజేపీ అధికారాన్ని పంచుకుంటోంది. అలాగే కేంద్ర ప్రభుత్వంలో జేడీయూ కీలక భాగస్వామి. బీహార్కు ప్రత్యేక హోదా కల్పించాలనే డిమాండ్ను పక్కన పెట్టిన కేంద్రం.. బడ్జెట్లో కీలక కేటాయింపులు చేసింది. బీహార్లో ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలో బీహర్పై బడ్జెట్లో వరాల జల్లు కురిపించారు. తాజా బడ్జెట్లో బీహార్కు ప్రత్యేక కేటాయింపులు చేశారు. బీహార్లో మఖానా బోర్డు ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రకటించారు. మఖానా వ్యాపారం కోసం రైతుల సౌకర్యార్థం ఈ బోర్డు పని చేయబోతోంది. అలాగే బీహార్లోని మిథిలాంచల్ ప్రాంతంలో యాభై వేల ఎకరాలకు ప్రయోజనం చేకూర్చే వెస్టర్న్ కోసి కేనాల్కు ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించారు.
ఇక, బీహార్లో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు. అలాగే ఐఐటీ పట్నాను కూడా విస్తరిస్తామని హావిూ ఇచ్చారు. అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ కార్యకలాపాలకు మద్దతు ఇచ్చేందుకు బీహార్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. కేంద్రంలో ఎన్డీయే కూటమిలో మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ పూర్తిస్థాయి తొలి బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈసందర్భంగా బిహార్ పై వరాల జల్లు కురిపించారు. అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లనున్న ఆ రాష్టాన్రికి వార్షిక పద్దులో ప్రత్యేక స్థానం దక్కింది. ‘బిహార్లో ఏర్పాటుచేయనున్న మఖానా బోర్డు ద్వారా వాటి ఉత్పత్తి, ప్రాసెసింగ్, మార్కెటింగ్ అవకాశాలు మెరుగుపడనున్నాయి. దీనికింద రైతులకు శిక్షణ అందుతుంది. వారు అన్ని ప్రభుత్వ పథకాల నుంచి ప్రయోజనం పొందేలా బోర్డ్ చూస్తుంది‘ అని మంత్రి వెల్లడించారు. పదేళ్లలో 4 కోట్ల మందికి విమాన ప్రయాణం కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్న కేంద్రం ఆ దిశగా బిహార్లో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది.
బిహార్లో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ, ఎంటర్ప్రెన్యూర్షిప్ అండ్ మేనేజ్మెంట్ ఏర్పాటుచేయనున్నట్లు మంత్రి ప్రకటించారు. దీనిద్వారా ఫుడ్ ప్రాసెసింగ్ కార్యకలాపాలకు మరింత మద్దతు అందనుంది. బిహార్కు ప్రత్యేక హోదా సాధ్యం కాదని తేల్చిచెప్పిన కేంద్రం.. ఎన్నికల ముందు ఇలా వరాల జల్లు కురిపించింది. గత ఏడాది సార్వత్రిక ఎన్నికల తర్వాత జులైలో ప్రవేశపెట్టిన బ్జడెట్లో కూడా రహదారుల అభివృద్ధి, గంగానది రెండు లైన్ల వంతెన నిర్మాణం, విద్యుదుత్పత్తి కేంద్రం వంటి పలు ఆర్థిక వరాలు ఇచ్చింది.