మహాత్ముడికి గవర్నర్‌ జిష్ణుదేవ్‌.. సిఎం రేవంత్‌ నివాళి

హైదరాబాద్‌, జనవరి 30: జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పలువురు ప్రముఖులు నివాళి అర్పించారు. గ్రామస్థాయి నుంచి రాజధాని వరకు బాపూకు నివాళి అర్పించారు. ఈ క్రమంలో హైదరాబాద్‌ బాపుఘాట్‌ లో గవర్నర్‌ జిష్ణు దేవ్‌ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ జితేందర్‌, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్‌ కుమార్‌ గౌడ్‌, బీసీ కమిషన్‌ చైర్మన్‌ నిరంజన్‌, ఉన్నతాధికారులు నివాళులు అర్పించారు. బాపూఘాట్‌ చేరుకున్న వీరంతా బాపూ విగ్రహం వద్ద పూలు అర్పించి నివాళి అర్పించారు. సర్వమత ప్రార్థనలు సాగాయి. దేశం కోసం ప్రాణాలు అర్పించిన పలువురు ప్రముఖుల త్యగాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News