రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం

పెద్దపల్లి, జనవరి 29: పెద్దపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సుల్తానాబాద్‌ మండలం కాట్నపల్లి వద్ద కారు కల్వర్టును ఢీ కొట్టింది. ఈ దుర్ఘటనలో కారులో ప్రయాణిస్తున్న 9 మందిలో ఇద్దరు స్పాట్‌ లోనే చనిపోయారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరొకరి చనిపోయారు. దీంతో మృతుల సంఖ్య ముగ్గురికి చేరింది. మిగిలిన వారికి తీవ్ర గాయాలయ్యాయి. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో కూడా రోడ్డు ప్రమాదం జరిగింది. మహదేవపూర్‌ అయ్యప్ప స్వామి ఆలయం దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. 353 నేషనల్‌ హైవేపై అదుపుతప్పి మైలురాయిని బైక్‌ కొట్టింది. ఒకరికి తీవ్రగాయలు కాగా, మరొకరికి స్వల్ప గాయాలయ్యాయి. ఇద్దరినీ ఆసుపత్రికి తరలించారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News