ప్రజాసంక్షేమ కార్యక్రమాలపై విస్తృత ప్రచారం

  • అధికారులకు మంత్రి పొంగులేటి సూచన

హైదరాబాద్‌, జనవరి 29: రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ప్రజల్లో అవగాహన కోసం, తద్వారా లబ్దిపొందడం కోసం విస్తృత ప్రచారం నిర్వహించాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌ మరియు సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి పేర్కొన్నారు. సమాచార పౌర సంబంధాల ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ రూపొందించిన 2025 సంవత్సర నూతన క్యాలెండరును మంత్రి హైదరాబాద్‌ లోని తన క్యాంపు కార్యాలయంలో బుధవారం ఆవిష్కరణ చేశారు. సందర్బంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను గ్రామ గ్రామాన ప్రజలకు విస్తృత ప్రచారం కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్‌ డైరెక్టర్‌, డి.యస్‌. జగన్‌, డిప్యూటీ డైరెక్టర్‌ మధుసూదన్‌, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ లక్ష్మణ్‌ కుమార్‌ పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News