ప్లీజ్‌.. వారి ఫొటోలు తీయొద్దు

సైఫ్‌ కరీనా కపూర్‌ పిల్లలు తైమూర్‌ అలీ ఖాన్‌, జహంగీర్‌ అలీ ఖాన్‌ల ఫొటోలను తీయొద్దని కోరారు. స్కూల్‌కు వెళ్తున్న సమయంలో, బర్త్‌డే వేడుకల్లో, క్రీడా కేంద్రాల్లో ఇలా ఎక్కడ కనిపించినా వారి ఫొటోలు తీయొద్దని విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా కరీనా, సైఫ్‌ అలీ ఖాన్‌ ఫొటోల కోసం కూడా వారి ఇంటి ముందు గుమిగూడొద్దని కోరింది. ఏదైనా మూవీ ఫంక్షన్‌లలో వారి ఫొటోలను తీసుకోవచ్చని పీఆర్‌ టీమ్‌ సూచించింది. సైఫ్‌ అలీఖాన్‌పై ఈ నెల 16న దాడిన జరిగిన విషయం తెలిసిందే. బాంద్రాలోని నటుడి నివాసంలో చోరీకి వచ్చిన దుండగుడు సైఫ్‌పై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో సైఫ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో నటుడిని కుటుంబ సభ్యులు లీలావతి ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అక్కడ వైద్యులు సైఫ్‌కు శస్త్ర చికిత్స చేశారు. ఇటీవలే డిశ్చార్జ్‌ అయిన సైఫ్‌.. ప్రస్తుతం కోలుకుంటున్నారు. మరోవైపు ఈ దాడి ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News