కేంద్రం నిధులిస్తోంది.. మోదీ ఫోటో పెట్టాల్సిందే

  • ఇళ్లకు ఇందిరమ్మ పేరు పెడితే ఊరుకునేది లేదు
  • రేషన్‌ కార్డులపైనా ప్రధాని ఫోటో ఉండాల్సిందే
  • లేకుంటే ఉచిత రేషన్‌ పంపిణీని ఆపేస్తాం
  • కేంద్రమంత్రి బండి సంజయ్‌ హెచ్చరిక

కరీంనగర్‌, జనవరి 25: ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన పేరుతో కేంద్రం మంజూరు చేసిన ఇళ్లకు ’ఇందిరమ్మ’ పేరు పెడతానంటే ఒక్క ఇల్లు కూడా మంజూరు చేసే ప్రసక్తే లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ తేల్చి చెప్పారు. ఇందిరమ్మ ఇళ్లు, రేషన్‌ కార్డులపై కేంద్ర మంత్రి బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందిరమ్మ పేరు పెడితే కేంద్ర ప్రభుత్వం ఒక్క ఇల్లు కూడా ఇవ్వదని ఆయన స్పష్టం చేశారు. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన పేరు పెడితేనే నిధులు ఇస్తామన్నారు. కాంగ్రెస్‌ ఫొటోలు పెడితే రేషన్‌ కార్డులు ఇవ్వబోమన్నారు. తామే ముద్రించి ప్రజలకు రేషన్‌ కార్డులు ఇస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో పాటు మాజీ సీఎం కేసీఆర్‌ విూద ఆయన విమర్శలు గుప్పించారు. కొత్త రేషన్‌ కార్డులపై సీఎం రేవంత్‌ రెడ్డితో పాటు ప్రధాని మోదీ ఫొటో ముద్రించాల్సిందేనని అన్నారు. రేషన్‌ కార్డులపై ప్రధాని ఫొటో పెట్టకపోతే ఉచిత బియ్యం ఎందుకివ్వాలని ప్రశ్నించారు. ప్రధాని ఫొటో పెట్టకపోతే పేదలకు కేంద్రమే నేరుగా ఉచిత బియ్యం అందించే అంశంపై ఆలోచన చేస్తామన్నారు.

కరీంనగర్‌ మేయర్‌ సునీల్‌ రావు భాజపాలో చేరిన అనంతరం బండి సంజయ్‌ మాట్లాడారు. ‘ఎప్పుడు ఎన్నికలు జరిగినా కరీంనగర్‌ కార్పొరేషన్‌ భాజపానని అన్నారు. కేంద్రం నుంచి నిధులు తెచ్చినా గత పదేళ్లలో ఏనాడూ భారాస నేతలు నన్ను పిలవలేదు. స్మార్ట్‌ సిటీ ప్రాజెక్టుకు నేను నిధులు తీసుకొస్తే.. వాళ్లు పనులు ప్రారంభించారు. స్మార్ట్‌ సిటీ ప్రాజెక్టు నిధులను దారిమళ్లిస్తే.. కొట్లాడి మరీ అడ్డుకున్నానని అన్నారు. కరీంనగర్‌ కోసం ఎంత కష్టపడినప్పటికీ నన్ను ఏనాడూ ప్రభుత్వ కార్యక్రమాలకు పిలవకుండా దూరంపెట్టారు. మోదీ ప్రభుత్వం అందించిన నిధులతోనే కరీంనగర్‌లో అభివృద్ధి జరిగిందని ప్రజలకు అర్థమైంది. భారాస పాలనలో అవినీతి, అక్రమాలకు అంతులేకుండా పోయింది. మాజీ సీఎం కేసీఆర్‌ అడుగుజాడల్లోనే కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నడుస్తున్నారు‘ అని బండి సంజయ్‌ దుయ్యబట్టారు. రేవంత్‌కు గురువు కేసీఆరేనని బండి సంజయ్‌ అన్నారు. ’రేవంత్‌కు కేసీఆరే గురువు. కేసీఆర్‌ ఏం చేశారో.. రేవంత్‌ అదే చేస్తున్నారు.

రేవంత్‌ పనిలో కొత్తదనం ఏవిూ లేదు. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు ఏమైంది కాళేశ్వరం అవినీతి ఎక్కడకు పోయింది కేసీఆర్‌ను జైల్లో ఎందుకు వేయడం లేదు రేపే అరెస్ట్‌ అని ఇంకా ఎన్ని రోజులు అంటారు ఫార్ములా కారు రేసు కేసులో కేటీఆర్‌ను ఎందుకు అరెస్ట్‌ చేయడం లేదు గ్రీన్‌ కో కంపెనీ నుంచి కాంగ్రెస్‌కు డబ్బులు ముట్టాయ్‌. దావోస్‌కు రెండుసార్లు పోయినా.. పెట్టుబడులపై స్పష్టత లేదు. శ్వేత పత్రం విడుదల చేయాలి’ అని బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News