హైదరాబాద్, జనవరి 23: స్వాతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా కూకట్ పల్లి నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ యువజన అధ్యక్షుడు, ఎండి సలీం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కూకట్ పల్లి యూత్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు కలికోట శంకర్, బాలాజీ నగర్ డివిజన్ యువజన అధ్యక్షుడు ఎండి సుల్తాన్, పి.శ్రావణ్, తదితరులు పాల్గొన్నారు.
