హైదరాబాద్, జనవరి 22: మౌలాలి డివిజన్ సమగ్రాభివృద్ధే తన ధ్యేయమని కార్పొరేటర్ గున్నాల సునీత శేఖర్ యాదవ్ అన్నారు. బుధవారం మౌలాలి డివిజన్ పరిధి లోని లక్ష్మీనగర్, సాయినాధపురం, ఆఫీసర్స్ కాలనీలలో రూ 40 లక్షల అంచనా వ్యయం తో నిర్మించబోయే సీసీ రోడ్ల పనులకు ఆమె కొబ్బరి కాయలు కొట్టి భూమి పూజ చేశారు. అనంతరం కార్పొరేటర్ సునీత శేఖర్ యాద వ్ మాట్లాడుతూ.. మౌలాలి డివిజన్ పరిధి లోని వివిధ కాలనీలు, మురికి వాడలలో నెల కొన్న సమస్యలను తెలుసుకుని, ప్రతిపాదనలు పంపి జీహెచ్ఎంసీ అధికారుల సహకారం తో ఆయా సదుపాయాలు కల్పిస్తున్నానని తెలిపారు.
ప్రధాన కూడళ్ళు, రహదారులను అభివృద్ధి పరిచే క్రమంలో భాగంగా సుమారు 6 చోట్ల ‘బ్యాడ్ లీ డామేజస్’ కు నిధులు మంజూరైనాయని వెల్లడించారు. మౌలాలి డివిజన్ లోని పలు కాలనీలలో రోడ్లన్నీ గుంతల మయం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, తరచూ ప్రమా దాలు చోటుచేసుకుంటున్నాయని తెలిపారు. అనేక కాలనీలలో రోడ్లను అభివృద్ధి చేయాల ని తాను పలుమార్లు సంబంధిత అధికారు లను కలిసి కోరగా, వారు సానుకూలంగా స్పందించారన్నారు. ఈ క్రమంలో బ్యాడ్లీ డామేజ్ కింద జోనల్ కమిషనర్ నిధులు మంజూరు చేశారని ఆమె చెప్పారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్, జిహెచ్ఎంసీ అధికారులకు ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కో ఆర్డినేటర్ వగ్గు చంద్రశేఖర్, బీజేపీ మౌలాలి డివిజ న్ ప్రెసిడెంట్ శివగౌడ్, ఉపాధ్యక్షుడు మల్లారెడ్డి, లక్ష్మీనగర్ మాజీ ప్రెసిడెంట్, బీజేపీ సీనియర్ నాయకుడు వగ్గు మురళి,నాయకులు విజ య్, రఘు, శేఖర్, శ్రీనివాస్ యాదవ్, మహేష్, పృథ్వీ తదితరులు పాల్గొన్నారు.