త్వరలో.. క్రీడా నగరంగా మారనుంది: వి హెచ్

  • తెలంగాణలో ఏర్పాటుకు కృషి చేస్తున్నాం

హైదరాబాద్, జనవరి 21: మంగళవారం అంబర్‌పేట వాటర్‌వర్క్స్‌ గ్రౌండ్‌లో.. రాజీవ్‌గాంధీ 18వ స్మారక అండర్‌–19 డే అండ్‌ నైట్‌ టీ20 లీగ్‌ క్రికెట్‌ చాంపియన్‌షిప్‌ 2025 పోటీలను తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి దీపాదాస్ మున్షి ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ.. దేశంలో మొట్టమొదటి సారిగా సీఎం రేవంత్‌రెడ్డి స్పోర్ట్స్‌ యూనివర్సిటీ ఏర్పాటుకు కృషి చేయడం అభినందనీయమన్నారు. మాజీ ఎంపీ, వి. హనుమంతరావు మాట్లాడుతూ.. హైదరాబాద్ ఏడాదిన్నరలోనే క్రీడా నగరంగా మారనుంది అని తెలియజేసారు. యువతలో క్రీడా స్ఫూర్తిని నింపేందుకు 18 ఏళ్లుగా రాజీవ్‌గాంధీ పేరుతో అండర్‌–19 క్రికెట్‌ పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఏఐసీసీ సెక్రటరీ పి. విశ్వనాథన్‌, తమిళనాడు ఎమ్మెల్యే జె హసన్‌, తెలంగాణ ఫిషరీస్‌ చైర్మన్‌ మెట్టు సాయికుమార్‌, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, టీపీసీసీ ప్రదాన కార్యదర్శి ఆర్‌. లక్ష్మణ్‌యాదవ్‌, క్రికెట్‌ పెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ శంబుల శ్రీకాంత్‌గౌడ్‌, క్రికెట్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడు ఆదె అవినాశ్‌ తదితరులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News