హైదరాబాద్, జనవరి 21: ప్రముఖ నటి ప్రియాంకా చోప్రా హైదరాబాద్ నగర శివారులోని చిలుకూరు బాలాజీ ఆలయాన్ని సందర్శించారు. సంబంధిత ఫొటోలను సోషల్ విూడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. బాలాజీ ఆశీస్సులతో కొత్త ప్రయాణం మొదలు పెడుతున్నట్టు తెలిపారు. లాస్ ఏంజెలెస్ నుంచి ఆమె కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ వచ్చిన సంగతి తెలిసిందే. మహేశ్ బాబు హీరోగా రాజమౌళి తెరకెక్కించనున్న (వర్కింగ్ టైటిల్)లో ప్రియాంక హీరోయిన్గా ఎంపికయ్యారంటూ ఇటీవల వార్తలొచ్చాయి. ఆ ప్రాజెక్టు కోసమే ఆమె హైదరాబాద్ వచ్చారంటూ నెట్టింట చర్చ జరిగింది. ఆ సినిమాని ఉద్దేశించే కొత్త ప్రయాణమని చెప్పినట్టు పలువురు సినీ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.
