షూటింగ్‌లో ప్రమాదం.. రకుల్ ప్రీత్ సింగ్ భర్తకు గాయాలు

హీరోయిన్ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ భర్త జాకీ భగ్నానీకి షూటింగ్‌లో ప్రమాదం జరిగింది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ ఆలస్యంగా వెల్లడించింది. అర్జున్‌ కపూర్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘మేరే హస్బెండ్‌కి బీవీ’. ఈ సినిమాను రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ భర్త జాకీ భగ్నానీ నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ జరుపుకుంటుండగా.. షూటింగ్‌లో సెట్‌ పైకప్పు కూలిపోవడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో అర్జున్‌ కపూర్‌తో పాటు నిర్మాత జాకీ భగ్నానీకి గాయలు అయినట్లు సమాచారం. ఈ ప్రమాదంపై ఫెడరేషన్‌ ఆఫ్‌ వెస్ట్రన్‌ ఇండియా సినీ ఎంప్లాయిస్‌ అధ్యక్షుడు తివారీ స్పందిస్తూ షూటింగ్‌లో సెట్‌ పైకప్పు కూలిపోవడంతో ఈ ఘటన జరిగినట్లు వెల్లడిరచాడు. ఈ ఘటన జరిగి రెండు రోజులు అయ్యిందని.. అదృష్టవశాత్తూ, ఎవరూ తీవ్రంగా గాయపడలేదని తెలిపాడు. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా చూసుకుంటామని భద్రతా కారణాల దృష్ట్యా ప్రస్తుతం ఆ ప్రదేశంలో షూటింగ్‌ను నిలిపివేసినట్లు తివారీ తెలిపాడు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News