జర్నలిస్టు రమేష్ మృతికి సంతాపం

  • నివాళులర్పించిన టీడబ్ల్యూజేఎఫ్ నేతలు

హైదరాబాద్,జనవరి 20: అమీర్ పేట ప్రాంతంలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందిన ఆంధ్రజ్యోతి రిపోర్టర్ ఎర్రం రమేష్ కు పలువురు జర్నలిస్టులు నివాళులర్పించారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు, గ్రేటర్ హైదరాబాద్ జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు మామిడి సోమయ్య జర్నలిస్టు రమేష్ బౌతిక కాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయనతో పాటు ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పులిపలుపుల ఆనందం, బండి విజయ్ కుమార్, మహబూబ్ నగర్ జిల్లా కార్యదర్శి గోపాల్ తదితరులు నివాళులర్పించారు. కాగా మరణించిన జర్నలిస్టు రమేష్ బౌతి కాయానికి సోమవారం గాంధీ మార్చురీలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. అక్కడి నుంచి ఆయన బౌతిక కాయాన్ని వెంగళరావునగర్ లోని అతని ఇంటికి తీసుకువెళ్ళి కొద్ది సేపు ఉంచారు. అక్కడి నుంచి అంత్యక్రియల కోసం సాయంత్రం ఆయన స్వస్థలం గుంటూరు జిల్లా జోన్నలగడ్డకు తరలించారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News