తిరుపతి, జనవరి 20: తిరుపతి జిల్లా రేణిగుంట-కడప ప్రధాన రహదారిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. తిరుమల శ్రీవారి దర్శించుకుని హైదరాబాద్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. రేణిగుంట-కడప ప్రధాన రహదారిలోని కుక్కల దొడ్డి వద్ద ప్రైవేట్ బస్సును కారు ఢీకొనడంతో ఈ ఘటన సంభవించింది. కారులో ప్రయాణిస్తున్న భార్యాభర్తలిద్దరూ అక్కడకక్కడే మృతి చెందారు. హైదరాబాద్ లోని పటాన్ చెరువుకు చెందిన సందీప్ (45) అంజలీదేవి(40)గా పోలీసులు గుర్తించారు. విషయం తెలుసుకున్న రేణిగుంట ఎస్ఐ అరుణ్ కుమార్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని, మృతదేహాలను ఆసుపత్రికి తరలిస్తున్నారు.
