కోటి దాటిన పసుపు కార్యకర్తల సభ్యత్వం

  • ఎన్టీఆర్‌ పెట్టిన ముహూర్తం బలమైనది
  • కార్యకర్తలకు లోకేశ్‌ బావోద్వేగ లేఖ

అమరావతి, జనవరి 16: తెలుగుదేశం పార్టీ సరికొత్త చరిత్ర సృష్టించింది. పార్టీ సభ్యత్వాల సంఖ్య 1,00,52,598 తో రికార్డు సృష్టించింది. కోటి సభ్యత్వాల మార్క్‌ దాటిన సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ లేఖ రాశారు. కార్యకర్తే అధినేత అంటూ ప్రశంసించారు. స్వర్గీయ నందమూరి తారకరామారావు పార్టీ పెట్టిన ముహూర్త బలం చాలా గట్టిదని పేర్కొన్నారు. నాడు ఒక్కరితో ప్రారంభమైన ప్రయాణం నేడు కోటి మందితో అతి పెద్ద కుటుంబంగా మారిందని వ్యాఖ్యానించారు. సభ్యత్వం తీసుకొని తెలుగుదేశం పార్టీ కుటుంబసభ్యులుగా చేరిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలపారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని గ్రామగ్రామాన ఒక పండగలా నిర్వహించారని ప్రశంసించారు. ఊరూవాడా జై టీడీపీ నినాదాలతో హోరెత్తించారని అన్నారు. ఆంధప్రదేశ్‌, తెలంగాణ, అండమాన్‌తో సహా అనేక ప్రాంతాల్లో ఉన్న తెలుగు వారు, వివిధ దేశాల్లో ఉన్న ఎన్‌ఆర్‌ఐలు సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పెద్ద ఎత్తున భాగస్వాములు అయ్యారని తెలిపారు.

గత రికార్డులు తిరగరాస్తూ కోటి సభ్యత్వాలతో సరికొత్త చరిత్ర సృష్టించామని హర్షం వ్యక్తం చేశారు.సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కార్యకర్తలు, నాయకులు, సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి బలం, బలగం.. పసుపు జెండా అంటే మనకు ఒక ఎమోషన్‌ అని వ్యాఖ్యానించారు. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ప్రత్యర్ధులు ఉన్మాదుల్లా విూద పడుతుంటే విూసం మెలేసి, తొడకొట్టి జై చంద్రబాబు అన్న అంజిరెడ్డి తాత తెగువ తనకు నిత్యస్ఫూర్తి అని తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో బూత్‌ ఏజెంట్‌గా ఉండటానికి వీలు లేదని ప్రత్యర్థి మూకలు గొడ్డలి వేటు వేసినా రక్తపు గాయాలతోనే పోలింగ్‌ బూత్‌లో కూర్చొని రిగ్గింగ్‌ అడ్డుకున్న ఉక్కు మహిళ మంజుల గారి ధైర్యం గురించి గుర్తుచేసుకున్న ప్రతిసారి తనకు గర్వంగా ఉంటుందని అన్నారు. ఏమి ఇచ్చినా, ఎన్ని జన్మలెత్తినా కార్యకర్తల రుణం తీర్చుకోలేనిదని అన్నారు. దేశంలో ఏ పార్టీకి లేని కార్యకర్తల బలం టీడీపీకి మాత్రమే సొంతమని అన్నారు. ఏ పార్టీ ఇవ్వని గౌరవం తెలుగుదేశం పార్టీ తమ కార్యకర్తలకు ఇస్తుందని చెప్పారు.

టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీలో ఏ ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలన్నా కార్యకర్తలతో చర్చించిన తరువాతే ప్రకటిస్తారని గుర్తు చేశారు. కార్యకర్తల మనోభావాలను, అభిప్రాయాలను గౌరవించే ఒకే ఒక్క పార్టీ తెలుగుదేశం మాత్రమే అని అన్నారు. కార్యకర్తలకు ఉపాధి, వైద్యంతో పాటు వారి పిల్లల చదువుకు సాయం చెయ్యాలని చెబుతుంటారు. కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్తగా పవిత్రమైన బాధ్యత నాకు అప్పగించారు. ఇప్పటివరకు 2,500 మందికి పైగా కార్యకర్తల పిల్లల చదువులకు సహాయం అందించాం. వివిధ ప్రమాదాల్లో మరణించిన సుమారు 5,164 మంది కార్యకర్తల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 2 లక్షల రూపాయలు చొప్పున రూ.103 కోట్ల 28 లక్షల రూపాయలు అందజేసాం. అనారోగ్యంతో బాధపడుతున్న అనేక మంది కార్యకర్తలకు వైద్య సహాయం అందించాం. సుమారు 2000 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాం. సుమారు 5,000 మంది కార్యకర్తల కుటుంబాలకు కష్ట కాలంలో అండగా నిలిచి రూ. 19 కోట్లు ఆర్థిక సహాయం చేసాం.

సభ్యత్వం తీసుకున్న తెలుగుదేశం కార్యకర్తల సంక్షేమం చూసేందుకు టీడీపీ కార్యకర్తల సంక్షేమ విభాగం అవిశ్రాంతంగా పని చేస్తోందని వెల్లడిరచారు. ఎన్టీఆర్‌ మోడల్‌ స్కూళ్ల ద్వారా ఉచిత విద్య, ఉపకారవేతనాలు, ప్రైవేట్‌ స్కూళ్లలోనూ ఫీజుల్లో రాయితీలు రూ. 2 కోట్ల 35 లక్షల రూపాయలు చెల్లించాం. చదువు పూర్తయిన వారికి ఉపాధి..ఉద్యోగావకాశాలు సాధించేలా నైపుణ్యశిక్షణ ఇస్తున్నాం. ప్రస్తుతం సభ్యత్వం ద్వారా వచ్చే ప్రమాద బీమా ప్రయోజనాన్ని రూ. 5 లక్షలకు పెంచాం. జెండా మోసే ప్రతి కార్యకర్తకు అండగా నిలవడమే నా ఎజెండా. కొన్ని నియోజకవర్గాల నాయకులు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని లక్షకు పైగా సభ్యత్వాలు చెయ్యడంతో పాటు లైఫ్‌ టైమ్‌ సభ్యత్వాలు కూడా ఎక్కువగా చేశారు, వారికి నా ప్రత్యేక అభినందనలు‘ అని నారా లోకేశ్‌ లేఖలో పేర్కొన్నారు. లైఫ్‌ టైమ్‌ సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News