తిరుగు ప్రయాణంలో నగరవాసులు..

  • టోల్‌ గేట్‌ వద్ద భారీగా ట్రాఫిక్‌ జామ్‌

హైదరాబాద్‌, జనవరి 15: సంక్రాంతి పండుగను పురస్కరించుకొని సొంతూళ్లకు వెళ్లిన హైదరాబాద్‌ వాసులు తిరుగుపయనమయ్యారు. ఈ క్రమంలో ఆంధప్రదేశ్‌ నుంచి హైదరాబాద్‌కు వస్తున్న వాహనాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. యాదాద్రి జిల్లా పరిధిలోని పంతంగి టోల్‌ఎª`లాజా వద్దకు భారీగా వాహనాలు చేరుకుంటున్నాయి. పంతంగి టోల్ ప్లాజాలోని 12 టోల్‌బూత్‌ల ద్వారా ఏపీ నుంచి తెలంగాణ వైపు వాహనాలను అనుమతిస్తున్నారు. కిలోవిూటర్ల మేర వాహనాలు బారులు తీరడంతో నెమ్మదిగా ముందుకు కదులుతున్నాయి. ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా పోలీసులు ముందస్తు ఏర్పాట్లు చేశారు. ఏపీ వ్యాప్తంగా ప్రయాణ ప్రాంగణాల్లోనూ రద్దీ పెరుగుతోంది.

సొంతూళ్లకు వచ్చిన వారంతా తిరుగుపయనమవడంతో విజయవాడ బస్టాండ్‌, రైల్వే స్టేషన్‌లో రద్దీ ఒక్కసారిగా పెరిగింది. రద్దీని దృష్టిలో పెట్టుకొని పలు ప్రాంతాలకు ఏపీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. విజయవాడ నుంచి హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై, తదితర ప్రాంతాలకు 116 అదనపు సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది. అదనపు బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్‌ సౌకర్యం కల్పించామని.. సాధారణ ఛార్జీలే వసూల చేస్తున్నట్లు ఏపీఎస్‌ ఆర్టీసీ తెలిపింది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News