లోకేశ్‌తో మంచు మనోజ్‌ భేటీ

  • కాలేజీ గలాట తరవాత నారావారి పల్లికి చేరిక

తిరుపతి, జనవరి 15: ఏపీ మంత్రి నారా లోకేష్‌తో మంచు మనోజ్‌ భేటీ అయ్యారు. బుధవారం నారావారిప్లలెకు చేరుకున్న మనోజ్‌.. మంత్రి లోకేష్‌తో సమావేశం అయ్యారు. దాదాపు 45 నిమిషాల పాటు వీరి సమావేశం సాగింది. అయితే వీరి ఇద్దరి భేటీలో ఆస్తి వివాదం చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. తిరుపతిలో మోహన్‌బాబుకు చెందిన కళాశాల వద్ద నిన్న వందలాదిగా ప్లెక్సీలను మంచు మనోజ్‌ ఏర్పాటు చేశారు. అయితే ఈరోజు ఉదయానికల్లా వాటిని కొందరు బౌన్సర్లు తొలగించేశారు. విూడియాకు సమాచారం ఇచ్చి మరీ మంచు మనోజ్‌ కళాశాలకు వచ్చారు. కానీ మనోజ్‌ కళాశాలకు రాకుండా ఇప్పటికే కోర్టు నుంచి మోహన్‌ బాబు కుటుంబం ఇంజక్షన్‌ తీసుకుంది. దీంతో కాలేజ్‌కు వద్దకు వచ్చిన మనోజ్‌ను పోలీసులు అడ్డుకుని.. ఇంజక్షన్‌ ఆర్డర్‌ ఉన్న విషయాన్ని తెలియజేశారు. కాలేజ్‌కు సంబంధించి నాలుగు గేట్ల వద్దకు మనోజ్‌ చేరుకుని అక్కడి పోలీసులతో మాట్లాడి విషయం తెలుసుకున్నారు. మనోజ్‌తో పాటు భార్య మౌనిక కూడా కాలేజ్‌కు వచ్చారు. ఆ వ్యవహారాన్ని మొత్తం వీడియో తీశారు మనోజ్‌ ప్రైవేట్‌ సెక్యూరిటీ.

అనంతరం మోహన్‌ బాబు కళాశాల దగ్గర్లోనే నారావారిపల్లి ఉండటంతో.. కళాశాల వద్ద నుంచి నారావారిప్లలెకు వచ్చి 45 నిమిషాలు లోకేష్‌తో గడిపారు మనోజ్‌ దంపతులు. కళాశాల వద్ద చంద్రబాబుతో మోహన్‌ బాబు తీసుకున్న ఫోటోలు, నారా లోకేష్‌తో విష్ణు తీసుకున్న ఫోటోలని ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో నారా కుటుంబంతో తన సన్నిహిత్యాన్ని తెలిపేందుకు లోకేష్‌ను మనోజ్‌ కలిసినట్లు తెలుస్తోంది. అయితే నారా లోకేష్‌తో గడిపినప్పటి ఎటువంటి ఆస్తుల వివాదం చర్చకు రానట్లు తెలుస్తోంది. ఆస్తులు వివాదం పూర్తిగా వ్యక్తిగతం అయిన నేపథ్యంలో ఏ వర్గం వైపు లేకుండా నారా కుటుంబం వ్యవహరిస్తున్నట్లు సమాచారం.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News