తెలుగు రాష్టాల్రకు కొత్తగా ఆరుగురు జడ్జిలు

  • సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు
  • తెలంగాణ హైకోర్టు సిజెగా జస్టిస్ట్‌ సంజయ్‌ పాల్‌ నియామకం

న్యూఢిల్లీ, జనవరి 15: తెలంగాణ, ఆంధప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జిలుగా పలువురి పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. తెలంగాణ హైకోర్టుకు నలుగురు, ఏపీ హైకోర్టుకు ఇద్దరి పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. తెలంగాణ హైకోర్టుకు వై.రేణుక, నందికొండ నర్సింగరావు, తిరుమల దేవి, మధుసూదన్‌ రావు N ఏపీ హైకోర్టుకు హరిహరనాథ శర్మ, యడవల్లి లక్ష్మణరావు పేర్లు సిఫార్సు చేసింది. జ్యుడీషియల్‌ ఆఫీసర్ల కోటాలో ఈ ఆరుగురు పేర్లను కొలీజియం సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది.ఇదిలావుంటే తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ సుజయ్‌పాల్‌ను రాష్ట్రపతి నియమించారు. హైకోర్టు సీనియర్‌ న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్‌ సుజయ్‌పాల్‌కు సీజేగా బాధ్యతలు అప్పగిస్తూ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆలోక్‌ అరాధే బాంబే హైకోర్టు సీజేగా బదిలీ అయ్యారు.

1964 జూన్‌ 21న జన్మించిన జస్టిస్‌ సుజయ్‌పాల్‌ బీకాం, ఎంఏ, ఎల్‌ఎల్‌బీ పూర్తిచేసి 1990లో మధ్యప్రదేశ్‌ బార్‌ కౌన్సిల్‌లో పేరు నమోదు చేసుకున్నారు. పలు బ్యాంకులు, మానవ హక్కుల కమిషన్‌, బోర్డులకు సేవలు అందించిన ఆయన 2011 మే 27న మధ్యప్రదేశ్‌ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా.. 2014 ఏప్రిల్‌ 14న శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసుతో 2024 మార్చి 21న తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు. తాజాగా ఆయన హైకోర్టు సీజేగా నియమితులయ్యారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News