రంగారెడ్డి, జనవరి 15: చెరువులోకి కారు వేగంగా దూసుకెళ్లిన ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలతో బయటపడిన సంఘటన రంగారెడ్డి జిల్లా కేశంపేటలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. షాద్నగర్కి చెందిన మల్లేశ్వర్ రావు అనే వ్యక్తి తన పౌల్ట్రీ ఫారం నుంచి కారులో తిరిగి వస్తున్నాడు. ఈ క్రమంలో వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి స్తంభాన్ని ఢీకొట్టి చెరువులోకి దూసుకెళ్లింది. గమనించిన స్థానికులు మల్లేశ్వర్ రావును సురక్షితంగా బయటకు తీసారు. చెరువులో ఎక్కువ నీళ్లు లేకపోవడంతో ప్రమాదం తప్పింది.
