ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ తో.. ప్రముఖుల ఫొటోలను మార్పింగ్‌

  • తాజాగా జాన్వీకపూర్‌, హర్దిక్‌పాండ్యా క్లోజ్‌గా ఉన్నట్లు వైరల్‌

న్యూఢిల్లీ, జనవరి 13: ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ సాయంతో కొందరు ఇచ్చిమొచ్చినట్లుగా ప్రముఖుల ఫొటోలను మార్పింగ్‌ చేసి నెట్టింట్లో పోస్టు చేస్తున్నారు. దీంతో దానిని చూసిన నెటిజన్లు అది నిజమోనని ఆరా తీయడం మొదలు పెడుతున్నారు. ఇది ఈ మధ్యకాలంలో బాగా పెరిగింది. ఇందుకు ప్రధాన కారణంగా ఎఐ ఆర్టిఫిషియల్‌ ఇంకా మరింత అభివృద్ధి చెందటమే కారణంగా.ఈ నేపథ్యంలో క్రికెటర్‌ హార్దిక్‌ పాండ్యా, స్టార్‌ నటి జాన్వీ కపూర్‌ డేటింగ్‌లో ఉన్నారంటూ సోషల్‌ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. అందుకు కారణం ఇద్దరూ చనువుగా ఉన్న ఫొటోలు వైరల్‌ కావడమే. వీరిద్దరూ కలిసి ఇటీవలే మాల్దీవుల్లో విహరించినట్లు ఆ ఫొటోలను బట్టి తెలుస్తోంది. జాన్వీ-పాండ్యా సముద్ర తీరంలో విహరిస్తూ, సన్నిహితంగా కనిపించారు.

ఈ ఫొటోలను చూసిన నెటిజన్లు హార్దిక్‌ జాన్వీ పీకల్లోతు ప్రేమలో ఉన్నారంటూ మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. దీంతో రంగంలోకి దిగిన నేషనల్‌ మీడియా ఫ్యాక్ట్‌ చెక్‌ నిర్వహించగా అసలు విషయం బయటపడింది. ఈ ఫొటోలు నిజం కాదని తేల్చింది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సాయంతో క్రియేట్‌ చేసినవిగా తేల్చింది. దీంతో వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారంటూ వచ్చిన వార్తలు కేవలం పుకార్లు మాత్రమే అని స్పష్టమైంది. కాగా, హార్దిక్‌ పాండ్యా ఇటీవలే తన భార్య నటాషా స్టాంకోవిక్‌తో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం తన దృష్టిమొత్తం కెరీర్‌పైనే పెట్టాడు. ఇక జాన్వీ కపూర్‌ వరుస బాలీవుడ్‌ ప్రాజెక్టులతోపాటు టాలీవుడ్‌ సినిమాలతో బిజీగా మారిపోయింది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News