పోలీసులకు.. తెలంగాణ ప్రభుత్వం సంక్రాంతి కానుక

  • 187 మందికి ఎస్‌ఐలుగా ప్రమోషన్‌

హైదరాబాద్‌, జనవరి 10: కానిస్టేబుల్స్‌కు తెలంగాణ ప్రభుత్వం సంక్రాంతి కానుక ప్రకటించింది. 1989, 1990 బ్యాచ్‌ లో.. ఎంపికైన పోలీస్‌ కానిస్టేబుల్స్‌కు ప్రభుత్వం ప్రమోషన్‌ కల్పించింది. హైదరాబాద్‌ రీజియన్లోని 187 ఎఎస్‌లకు.. ఎస్‌ఐ గా ప్రమోషన్‌ కల్పించింది. ఈ మేరకు డిజిపి జితేందర్‌ ఆదేశాలతో ప్రమోషన్లు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రీ ప్రమోషనల్‌ ట్రైనింగ్‌ పూర్తి చేసిన రోజునే ప్రమోషన్స్‌ ఇవ్వడంతో సిబ్బందిలో ఆనందోత్సవాలతో సంబరాలు చేసుకుంటున్నారు. సీఎం రేవంత్‌ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. గత బీఆర్‌ఎస్‌ సర్కార్‌ హయాంలో పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ ను పెద్దగా పట్టించుకోలేదు. కానిస్టేబుళ్ల ప్రమోషన్స్‌ ను నిర్లక్ష్యం చేసింది. కోర్టుల్లో కేసులున్నాయంటూ ప్రమోషన్లు ఆపేసింది. ఇతర డిపార్టమెంట్లలో తమతో పాటు జాయిన్‌ వారు పెద్ద పొజిషన్‌లో ఉండగా.. తాము మాత్రం ఎక్కడికక్కడే మిగిలిపోవాల్సి వచ్చిందని కానిస్టేబుల్స్‌ బాధ పడేవారు.ఈ క్రమంలో 187 మందికి ప్రమోషన్‌ కల్పించింది కాంగ్రెస్‌ ప్రభుత్వం.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News