- శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు
తిరుమల, జనవరి 10: తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలను తితిదే ప్రారంభించింది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ప్రధాన ఆలయంతోపాటు తిరుమల అంతంటా 14 టన్నుల పుష్పాలు, 1.5 టన్నుల కట్ ప్లవర్స్తో తోరణాలు, పుష్ప అలంకరణను తితిదే ఉద్యానవన శాఖ ఏర్పాటు చేసింది. ఆలయ సవిూపంలోని వైకుంఠంలో మహలక్ష్మి, విష్ణు అవతారాలతో ఏర్పాటు చేసిన నమూనా భక్తులను ఆకట్టుకుంటోంది. పలు రకాల పుష్పాలు, పండ్లతో ఏర్పాటు చేసిన వైకుంఠం నమూనా భక్తులను మంత్రముగ్ధుల్ని చేస్తోంది. తిరుమలలో ఇలా ఏర్పాటు చేసిన పుష్పాలంకరణతో పాటు పూల మరిమళం భక్తులను ఆకట్టుకుంటోంది. ఎక్కడ చూసిన ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఇకపోతే వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని స్వామివారు స్వర్ణరథంపై మాడవీధుల్లో ఊరేగారు. గోవిందనామ స్మరణలు మార్మోగాయి.
భక్తులు స్వామి రథాన్ని తిలకించి పులకించి పోయారు. స్వామిని చూసేందుకు భక్తులు పోటీపడ్డారు. ఇదిలావుంటే వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల దివ్యక్షేత్రం గోవిందనామస్మరణతో మారుమ్రోగింది. రాజకీయ, క్రీడా ప్రముఖులు, భక్తులు పెద్ద సంఖ్యలో శ్రీ వేంకటేశ్వరస్వామినిదర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శుక్రవారం వైకుంఠ ద్వార దర్శనం తెల్లవారుజాము నుంచే ప్రారంభం కాగా ముందుగా వీఐపీలకు దర్శనం కల్పించిన అనంతరం ఉదయం 8 గంటల నుంచి టోకెన్లు గల భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పించారు. రాష్టాల్ర గవర్నర్లు, ఆంధప్రదేశ్, తెలంగాణ రాష్టాల్రకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు స్వామివారిని దర్శించుకున్నారు.
హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్ర విమానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుకుటుంబ సభ్యులు, ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి దామోదర రాజనరసింహ, పొన్నం ప్రభాకర్, తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు. శివసేన ఎంపీ శ్రీకాంత్ షిండే, మాజీ సీఎం ఎన్టీఆర్ తనయుడు రామకృష్ణ, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సతీమణి వసుందర, బాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపిచంద్ ), ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ తదితరులు ఏడుకొండలవాడిని దర్శించుకున్నారు.