హైదరాబాద్, జనవరి 10: మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. రాష్ట్ర వ్యాప్తంగా వైష్ణవ ఆలయాల్లో వైకుంఠ ఏకాదశి వైభవంగా జరుగుతుందని, ఈ పర్వదినంనా ఉత్తర ద్వారా దర్శనం ప్రత్యేకత అని అన్నారు. ఈ సందర్భంగా హరీశ్రావు ఓ శ్లోకాన్ని ట్వీట్ చేశారు.
