బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ స్వీయ దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం ‘ఎమర్జెన్సీ’. దివంగత భారత ప్రధాని ఇందిరాగాంధీ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో ఇందిరాగాంధీగా కంగనా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం గతేడాది ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా.. అనుకోని కారణాల వలన వాయిదా పడిరది. అయితే రీసెంట్గా సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జనవరి 17న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా ట్రైలర్ను కూడా పంచుకుంది. అయితే ఈ సినిమా విడుదలకు ఇంకా 10 రోజులే ఉండడంతో వరుస ప్రమోషన్స్లో పాల్గోంటుంది కంగనా. ఈ క్రమంలోనే ‘ఎమర్జెన్సీ’ సినిమాను చూడాలని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీని ఆహ్వానించినట్లు కంగనా తెలిపింది.
పార్లమెంటులో ప్రియాంక గాంధీని కలిశాను. ఆమెని కలిసిన అనంతరం నేను చెప్పిన మొదటి మాట.. ఆప్కో ఎమర్జెన్సీ దేఖ్నీ చాహియే (మీరు ఎమర్జెన్సీ సినిమాని చూడాలి). మీకు ఇది బాగా నచ్చుతుంది అంటూ ప్రియాంకాకు చెప్పాను. అయితే ఈ విషయంలో ప్రియాంక కూడా సున్నింతంగా స్పందిస్తూ.. అవును కావచ్చు అంటూ తెలిపినట్లు కంగనా చెప్పుకోచ్చింది. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ప్రియాంకకు నాన్నమ్మ అవుతుందన్న విషయం తెలిసిందే. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఇందిరా గాంధీ ప్రధాన మంత్రిగా ఉన్న సమయంలో 1975 నుంచి 1977 వరకు 21 నెలల పాటు ‘ఎమర్జెన్సీ’ విధించిన విషయం తెలిసిందే.
ఈ సమయంలో భారత ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోన్నారు. మీడియా ఎలా అణచివేయబడిరది. వంటి యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా రాబోతుంది. ఈ సినిమాను జీ స్టూడియోస్, మణికర్ణిక ఫిలిమ్స్ బ్యానర్లు నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, మహిమా చౌదరి, మిలింద్ సోమన్, శ్రేయాస్ తల్పాడే తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.