నీట్‌.. జెఈఈ పరీక్షలకు అనుగుణంగా పాఠ్యపుస్తకాలు

  • NCERTకి అనుగుణంగా ఇంటర్‌లో సంస్కరణలు
  • మొదటి సంవత్సరం పరీక్ష ఎత్తివేత.. ఇంటర్నల్‌ పరీక్షలకు ప్రాధాన్యం
  • తల్లిందండ్రులు, మేధావుల నుంచి సలహాల స్వీకరణ
  • ఇంటర్‌ బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా వెల్లడి

అమరావతి, జనవరి 08: ఆంధ్రప్రదేశ్‌ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.. ఇంటర్‌ విద్యలో ప్రభుత్వం కీలక సంస్కరణలు తీసుకు వస్తోంది. ఇంటర్‌ విద్యలో కీలక సంస్కరణలకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. దీనికి సంబంధించిన పలు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు ఇంటర్‌ బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా తెలిపారు. ప్రధానంగా మొదటి సంవత్సరం పబ్లిక్‌ పరీక్షలను తొలగించి రెండో సంవత్సరం పరీక్షలను నిర్వహిస్తామని ఇంటర్‌ బోర్డ్‌ కార్యదర్శి కృతికా శుక్లా స్పష్టం చేశారు. మొదటి ఏడాది పరీక్షలు కాలేజీలో ఇంటర్నల్‌ గా నిర్వహిస్తామని.. రెండో సంవత్సరం మార్కులను పరిగణనలోకి తీసుకుంటాం అన్నారు. చాలా రాష్టాల్రు ఇంటర్‌ మొదటి ఏడాది పరీక్షలు నిర్వహించడం లేదన్నారు. దీంతో పాటు ఇంటర్‌ లో సిలబస్‌ మార్చాలని కూడా నిర్ణయం తీసుకున్నారు.

NCERT సిలబస్‌ ప్రవేశ పెట్టే ప్రతిపాదనకు సంబంధించిన ప్రజాభిప్రాయాన్ని తీసుకుంటాం అని కృతికా శుక్లా..అన్నారు. ఈ మేరకు విూడియా సమావేశంలో ఆమె వెల్లడిరచారు. 2025-26 ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో ఎన్‌సీఈఆర్టీ పాఠ్య పుస్తకాలు ప్రవేశపెడతాం అని అన్నారు. దీంతో నీట్‌, జేఈఈ వంటి జాతీయస్థాయి పోటీ పరీక్షలకు సులభమవుతుందన్నారు. 15 రాష్టాల్ల్రో ఎన్‌సీఈఆర్టీ పాఠ్యపుస్తకాలను ఇంటర్‌లో ప్రవేశపెట్టారు. సిలబస్‌ సంస్కరణ, నూతన సబ్జెక్ట్‌ కాంబినేషన్లకు ప్రతిపాదనలు చేస్తున్నాం. పరీక్షల మార్కుల కేటాయింపు విధానంలో సంస్కరణలు తెస్తామని అన్నారు. ఇందులో భాగంగా ఇంటర్‌ మొదటి సంవత్సర పబ్లిక్‌ పరీక్షలు తొలగిస్తాం. ఆయా కళాశాలలు అంతర్గతంగా ప్రథమ సంవత్సర పరీక్షలు నిర్వహిస్తాయి.

సీబీఎస్‌ఈ విధానంలో ముందుకెళ్తాం. ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం పరీక్షలనే బోర్డు నిర్వహిస్తుంది. ఈ నెల 26 లోగా సంస్కరణలపై సలహాలు, సూచనలు పంపాలి. ఇంటర్‌ బోర్డు వెబ్‌సైట్‌లో అందుబాటులో ప్రతిపాదిత సంస్కరణల వివరాలు ఉంచాం‘ అని కృతికా శుక్లా తెలిపారు. ఇంటర్‌ విద్యలో సంస్కరణలపై విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యావేత్తల నుంచి సలహాలు ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. ‘చాలా ఏళ్లుగా ఇంటర్‌ విద్యలో సంస్కరణలు జరగలేదు. జాతీయ కరికులం చట్టాన్ని అనుసరించి సంస్కరణలు చేపడుతున్నాం. సైన్స్‌, ఆర్ట్స్‌, భాషా సబ్జెక్టుల్లో సంస్కరణలు అమలు చేస్తాం. 2024-25 నుంచి పదో తరగతిలో ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యపుస్తకాలు ప్రవేశపెట్టారు.

గత కొన్నేళ్లుగా ఇంటర్‌ బోర్డ్‌ లో సంస్కరణలు జరగలేదు.. ప్రస్తుతం నాలుగు సంస్కరణలు ప్రధానంగా ఉన్నాయి అన్నారు కృతికా శుక్లా.. గత కొన్నేళ్లుగా పాఠ్య పుస్తకాల్లో మార్పులు జరగలేదు.. ఇంటర్‌ విద్యార్థులు పోటీ పరీక్షలకు హాజరు అవుతారు. వీరికి తగ్గట్టుగా కొత్త సిలబస్‌ తీసుకు రాబోతున్నాం అన్నారు. ప్రస్తుతం ఇంటర్‌ మొదటి సంవత్సరం సిలబస్‌ మార్పుపై దృష్టి పెట్టాం. ఇంటర్‌ మొదటి సంవత్సరం తెలుగు, ఇంగ్లీషు సిలబస్‌ మారుస్తున్నాం అన్నారు. సబ్జెక్ట్‌ ఎక్స్‌పర్ట్స్‌ కమిటీ ఈ సిలబస్‌పై దృష్టి పెట్టిందన్నారు. తెలుగు, సంస్కృతం, ఉర్దూ ఏదైనా అప్షన్‌ తీసుకునే అవకాశం విద్యార్థులకు ఉంది.

ఈ సిలబస్‌ వల్ల మాథ్స్‌.. కెమిస్టీ లో ప్రస్తుతం ఉన్న సిలబస్‌ బాగా తగ్గుతుందన్నారు. సిలబస్‌ ప్రకారం ప్రస్తుతం మార్పులు జరుగుతున్నాయని వెల్లడించారు. ఇంటర్‌ లో ఇక నుంచి ఇంటర్నల్‌ ప్రాక్టికల్‌ మార్క్స్‌ ఉంటాయి. ప్రతిసబ్జెక్టుకు ఈ ఇంటర్నల్‌ మార్కులు ఉంటాయి. 20 మార్కులు ఇంటర్నల్‌ గా ఉంటాయని ఏపీ ఇంటర్‌ బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా వెల్లడించారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News