హైదరాబాద్, జనవరి 05: మౌలాలి డివిజన్ పరిధిలోని గీతానగర్ కాలనీలోని స్ధానిక సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకుంటానని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. ఆదివారం గీతానగర్ కాలనీ అసోసియేషన్ సభ్యులు క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా గీతా నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ..తమ కాలనీలో అన్ని రోడ్లు గుంతల మయంగా మారాయని, వాటిని వెంటనే మరమ్మత్తు చేయించాలని కోరారు.
అదే విధంగా కాలనీలో మోడ్రన్ జిమ్ కొరకు గతంలోనే బల్దియా అధికారులకు వినతిపత్రం సమర్పించామని, త్వరగా మంజూరయ్యేలా అధికారులను ఆదేశించాలని ఎమ్మెల్యేను కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. బల్ది యా డిఈ మహేష్, మౌలాలి ఏఈ మధురిమ లతో ఫోన్ లో మాట్లాడి రోడ్లపై గుంతలు వీలైనంత త్వరగా పూడ్చాలని ఆదేశించారు. మోడ్రన్ జిమ్ ప్రతిపాదనను త్వరగా మంజూరు చేయించాలని ఆయన కోరారు.