మన్నె సుబ్రహ్మ‌ణ్యంకు నివాళి అర్పించిన సీఎం రేవంత్‌

హైదరాబాద్, జనవరి 05: ప్రముఖ పారిశ్రామికవేత్త, సమాజ సేవకుడు ఇటీవ‌ల కాలం చేసిన‌ మన్నె సుబ్రహ్మ‌ణ్యంకు సీఎం రేవంత్‌రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, నివాళి అర్పించారు. మన్నె సుబ్రహ్మ‌ణ్యం పెద్ద కర్మ ఆదివారం చర్లపల్లిలోని శ్రీ కృష్ణ కన్వెన్షన్ లో జరిగింది. పెద్ద కర్మకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరై మన్నె సుబ్రహ్మ‌ణ్యం చిత్ర ప‌టానికి పూల‌మాల‌లు వేసి నివాళి అర్పించారు. అనంత‌రం మన్నె సుబ్రహ్మ‌ణ్యం కుటుంబ సభ్యులను క‌లిశారు.

కార్య‌క్ర‌మం ప్రారంభం నుంచి చివ‌రి వ‌ర‌కు సీఎం రేవంత్‌రెడ్డి వెంట‌ ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జీ మందుముల పరమేశ్వర్ రెడ్డి ఉన్నారు. ఈ కార్యక్రమంలో.. మాజీ మేయర్ బొంతు రాంమోహన్, మాజీ ఏమ్మెల్యే సుదీర్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు సింగి రెడ్డి హరివర్ధన్ రెడ్డి, మేడ్చెల్ ఇంచార్జి వజ్రేష్ యాదవ్, కందికంటి అశోక్ గౌడ్, చెర్లపల్లి కార్పొరేటర్ బొంతు శ్రీదేవి, సీత రామ్ రెడ్డి, టి జి కే మూర్తి గారు, పావని రెడ్డి, ఆకారపు అరుణ్ పాల్గొన్నారు

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News