కేటీఆర్‌ పైన పెట్టిన కేసు దేశంలోనే చెత్త కేసు

  • ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్‌, జనవరి 04: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్‌ పైన పెట్టిన కేసు దేశంలోనే చెత్త కేసు అని ఆరోపించారు. ఆ కేసులో ఒక్క పైసా అవినీతి కూడా జరగలేదన్నారు. ఏసీబీ కేసు నమోదు చేయగానే ఈడీ నోటీసు ఇచ్చింది.. దీని వెనుక రాజకీయ దురుద్దేశం ఉందని పేర్కొన్నారు. బేషరతుగా వరంగల్‌ రైతు డిక్లరేషన్‌ అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. లక్షన్నర కోట్లు అప్పులు చేసి కొంత మంత్రులు దోచుకుని, ఢిల్లీకి కప్పం కట్టారని కేఏ పాల్‌ ఆరోపించారు. త్వరలో రైతులకు ప్రభుత్వం చేసింది నష్టాన్ని ఇంటింటికి తీసుకెళ్తామని తెలిపారు. ఇతర పార్టీల వారు ఏమైనా నగదు, గిప్ట్‌ లు ఇస్తే తీసుకోండి ఓటు మాత్రం తమ పార్టీకే వేయండని కేఏ పాల్‌ కోరారు.

ప్రజాశాంతి పార్టీ బడుగు, బలహీన వర్గాలకు చెందిన పార్టీ అని కేఏ పాల్‌ తెలిపారు. సీఎం రేవంత్‌ రెడ్డి ఊడిపోయే ముక్కు లాంటి పదవి ఎప్పుడు ఊడిపోతుందో తెలియదని విమర్శించారు. సీఎం రేవంత్‌ రెడ్డికి తానంటే చాలా ఇష్టమని.. ఆయనను ఐదు సార్లు కలిశానని చెప్పారు. సీఎంగా రేవంత్‌ రెడ్డి లక్ష కోట్లు అప్పు చేశాడు.. ఇంకో లక్ష కోట్లు అప్పు చేస్తాడని అన్నారు. తాను అధికారంలోకి వస్తే లక్ష కోట్లు తీసుకుని వస్తానని చెప్పారు. ఎస్సీ వర్గీకరణ వ్యవస్థను పాడు చేయడానికి చంద్రబాబు తీసుకుని వచ్చాడు.. వర్గీకరణ కోసం మాలలు, మాదిగలు కొట్టుకుంటున్నారని కేఏ పాల్‌ తెలిపారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News