కథానాయిక రుక్మిణి వసంత్కు సంబంధించిన ఆసక్తికరమైన వార్త ఒకటి శాండిల్వుడ్లో బాగా హల్చల్ చేస్తున్నది. వివరాల్లో కెళ్తే.. ఈ ముద్దుగుమ్మ ఇటీవలే ఎన్టీఆర్-ప్రశాంత్నీల్ సినిమాకు సంబంధించిన అగ్రిమెంట్లో సంతకం చేసింది. తమ సినిమా పూర్తయ్యేంతవరకు మరో సినిమా చేయకూడదని ఒప్పందం సారాంశం. ఇదిలావుంటే.. దీనికంటే ముందే ‘కాంతార-2’కు కూడా సైన్ చేసింది. ఈ సినిమా అయ్యేంతవరకూ మరో సినిమా చేయకూడదని రిషబ్శెట్టి ఒప్పందం. దానిక్కూడా ఓకే అనేసి, అడ్వాన్స్ అందుకుంది. ఈ రెండు సినిమాలకే కాక, చిన్నాచితకా సినిమాలక్కూడా ఓకే చెప్పిందట.
ఈ సినిమాలన్నీ ఈ ఏడాదే షూటింగ్స్ జరుపుకోనున్నాయి. దాంతో తీసుకున్న డబ్బుల్ని వెనక్కి ఇవ్వలేక, ఎటెళ్లాలో అర్థం కాక, బోనులో చిక్కుకున్న ఎలుకలా ఉక్కిరిబిక్కిరి అవుతున్నదట ఈ అందాల భామ. ఓ ప్లానింగ్ లేకుండా అగ్రిమెంట్లపై సంతకాలు చేసినందుకు అటు ప్రశాంత్నీల్, ఇటు రిషబ్శెట్టి ఈ ముద్దుగుమ్మపై కోపంగా ఉన్నారట. మరి ఈ సమస్యల నుంచి రుక్మిణి ఎలా బయటపడుతుందో చూడాలి. ప్రస్తుతం ఈ వార్త కర్ణాటక సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నది.