హైదరాబాద్, జనవరి 02: ఈ నెల 14 నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలు ప్రారంభం కానున్నాయి. తొలుత 14, 15 తేదీల్లో సీఎం బృందం ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. క్వీన్లాండ్ స్పోర్ట్స్ వర్సిటీని సందర్శించేందుకు సీఎం రేవంత్తో పాటు ప్రధాన కార్యదర్శి (సీఎస్), స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ కూడా వెళ్తున్నారు. అనంతరం ఈ బృందం జనవరి 16న సింగపూర్కు ప్రయాణించి, అక్కడి ఆధునిక క్రీడా ప్రాంగణాలను పరిశీలించనుంది. జనవరి 20 నుంచి 24 వరకు దావోస్లో జరుగనున్న అంతర్జాతీయ ఆర్థిక సదస్సుకు సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతారు. ఈ పర్యటనలో రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నంలో సీఎం కీలక సమావేశాలను నిర్వహించనున్నట్లు సమాచారం.
