సమిష్టి కృషితో వికసిత భారత్‌

  • కొత్త సంవత్సరంలో అడుగిడుతున్న సందర్భంగా మోడీ 

న్యూఢిల్లీ,డిసెంబర్‌ 31: నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్న సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలను ఉద్దేశిస్తూ.. పోస్టు పెట్టారు. ఈ ఏడాది భారత్‌ సాధించిన విజయాలను గురించి వివరిస్తూ ఓ వీడియోను షేర్‌ చేశారు. ’సమష్టిగా ప్రయాత్నించి.. 2024లో అనేక విజయాలు అందుకున్నాం. 2025లో మరింత కష్టపడి పనిచేసి వికసిత్‌ భారత్‌ కలను సాకారం చేసుకుందాం’ అని మోదీ పేర్కొన్నారు. దీనితో పాటు ఈ ఏడాది భారత్‌ సాధించిన విజయాలకు సంబంధించిన వీడియోను ఆయన పంచుకున్నారు. ఈ వీడియో ఒక ఏడాది కాలంలో సాధించిన పురోగతి, ఐక్యత, వికసిత్‌ భారత్‌ వైపు వేసిన అడుగులను గుర్తుచేస్తుందన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News