హైదరాబాద్, డిసెంబర్ 30: తెలంగాణ రాష్ట్రంలో పదిమంది ఐపీఎస్లు బదిలీ అయ్యారు. ఈ మేరకు సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. వివిధ జిల్లాలకు అదనపు ఎస్పీలు నియమించారు. కామారెడ్డి అదనపు ఎస్పీగా చైతన్యరెడ్డి, భువనగిరికి కనకాల రాహుల్రెడ్డి, ఆసిఫాబాద్కు చిత్తరంజన్, జనగామకు చేతన్, ఉట్నూర్ కు కాజల్, భద్రాచలానికి విక్రమ్కుమార్ సింగ్, కరీంనగర్ రూరల్ కు శుభం ప్రకాశ్, దేవరకొండ మౌనిక, నిర్మల్కు రాజేశ్ మీనాలకు పోస్టింగ్ ఇచ్చారు. అలాగే అంకిత్ కుమార్ ను డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
